News March 18, 2025
ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు, లోకేశ్

AP: మనుమడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు ఎల్లుండి తిరుమల వెళ్లనున్నారు. ఆయన వెంట మంత్రి లోకేశ్ సహా కుటుంబ సభ్యులు ఉండనున్నారు. ఈ సందర్భంగా నిత్యాన్నదాన పథకానికి వారి కుటుంబం విరాళం ప్రకటించనుంది. భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించనుంది. ఆ తర్వాతి రోజు టీటీడీ పరిపాలనా వ్యవహారాల్ని CBN సమీక్షిస్తారని తెలుస్తోంది.
Similar News
News February 4, 2026
వరిలో రెల్లరాల్చు పురుగును ఎలా నివారించాలి?

వరి పంటను రెల్లరాల్చు పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. ఈ పురుగు లార్వాలు గింజ గట్టిపడే దశలో కంకులను కత్తిరిస్తాయి. దీని వల్ల కంకులు రాలిపోతాయి. ఈ పురుగులు పగలు భూమిలో దాక్కొని రాత్రి వేళల్లో పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. ఈ పురుగుల ఉద్ధృతి తక్కువగా ఉంటే లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ.. ఉద్ధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి క్లోరంట్రనిలిప్రోల్ 0.3ml కలిపి సాయంత్రం వేళ పిచికారీ చేయాలి.
News February 4, 2026
BELలో 99 పోస్టులు.. అప్లై చేశారా?

చెన్నైలోని BEL 99 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. BE/BTech, BCom, BBA, BBM, డిప్లొమా, ITI అర్హత గలవారు ముందుగా NATS/NAPS పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ITI, డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులకు FEB 5న, BE/BTech అభ్యర్థులకు FEB 6, 7తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. అప్రెంటిస్గా ఏడాది పూర్తి చేసుకున్నవారికి పరీక్ష నిర్వహించి ట్రైనీ Engg., అడ్వాన్స్డ్ ట్రైనీస్గా నియమించుకుంటారు.
News February 4, 2026
సృజనాత్మకతకు నిలయం ‘స్వాధిష్టాన చక్రం’

నాభికి కింద ఉండే ఈ చక్రం సృజనాత్మకతకు, భావోద్వేగాలకు నిలయం. ఇది సరిగ్గా ఉంటేనే సంతోషం, కొత్త విషయాలను సృష్టించే శక్తి, చక్కని బాంధవ్యాలు ఉంటాయి. అస్థిరత ఏర్పడితే లైంగిక సమస్యలు, కోపం, మూత్రపిండాల వ్యాధులు వచ్చే ఛాన్సుంది. దీనిని ఉత్తేజితం చేయడానికి ‘వం’ మంత్రాన్ని పఠించాలి. నారింజ రంగు ఆహార పదార్థాలు తీసుకోవాలి. నీటితో సాన్నిహిత్యం(ఈత కొట్టడం, స్నానం) పెంచుకోవడం వల్ల ఈ చక్రం సమతుల్యం అవుతుంది.


