News December 29, 2024
సీఎం చంద్రబాబు పల్నాడు పర్యటన ఖరారు

AP: సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. నర్సరావుపేట నియోజకవర్గంలోని యల్లమంద గ్రామంలో ఈ నెల 31న ఉదయం 11 గంటలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. పెన్షన్ల పంపిణీ అనంతరం లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. మ.12.40 తర్వాత పల్నాడు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.
Similar News
News December 28, 2025
ఒక్క రోజే సెలవులో 40వేల మంది టీచర్లు

TG: నిన్న ఒకే రోజు 40వేల మందికిపైగా ప్రభుత్వ టీచర్లు సెలవు పెట్టారు. 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే హాలిడేస్, ఇవాళ(28న) ఆదివారం కావడంతో శనివారం(27న) లీవ్ పెట్టారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఇయర్ ఎండింగ్ కావడంతో CLలు సద్వినియోగం చేసుకునే ఆలోచనలో కొందరు సెలవు పెట్టినట్లు సమాచారం. రాష్ట్రంలో 1.12 లక్షల మంది టీచర్లు ఉండగా నిన్న ఒక్కరోజు 33% సెలవులో ఉన్నారు. దీంతో పలు చోట్ల పాఠాలు అటకెక్కాయి.
News December 28, 2025
మహిళలూ స్త్రీ ధనం గురించి తెలుసుకోండి

పెళ్లికి ముందు, పెళ్లి సమయంలో, మహిళకు ఆమె కుటుంబం, బంధువులు, స్నేహితులు ఇచ్చే వస్తువులను స్త్రీధనం అని పిలుస్తారు. ఇందులో మహిళకు చెందిన చర, స్థిరాస్తులతో పాటు బంగారం, వెండి ఆభరణాలు ఉంటాయి. మహిళ తను సంపాదించిన డబ్బుతో చేసిన ఏవైనా పొదుపులు, పెట్టుబడులు కూడా ఆమెకే దక్కుతాయి. స్త్రీధనం అనేది మహిళకు సంబంధించిన సంపూర్ణ ఆస్తి. ✍️ స్త్రీధనం గురించి మరింత సమాచారం కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>లోకి వెళ్లండి.
News December 28, 2025
ఇతరుల చెప్పులు, దుస్తులు ఎందుకు ధరించకూడదు?

ఇతరుల వస్త్రాలు, చెప్పులు ధరిస్తే వారిలోని ప్రతికూల శక్తి మనకు బదిలీ అవుతుందని నమ్మకం. ప్రతి వ్యక్తికీ ఓ ప్రత్యేకమైన శక్తి తరంగాలు ఉంటాయి. ఇతరుల వస్తువులను వాడటం వల్ల వారి జాతక దోషాలు, దురదృష్టం మనపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది మానసిక ప్రశాంతతను, ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుందని జ్యోతిషులు చెబుతారు. ఆరోగ్యపరంగానూ నష్టాలున్నాయి. చర్మవ్యాధులు, ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా సులభంగా వ్యాప్తి చెందుతాయి.


