News February 22, 2025

మిర్చి రైతులతో CM చంద్రబాబు కీలక భేటీ

image

AP: మిర్చి రైతులు, ట్రేడర్లతో CM చంద్రబాబు భేటీ అయ్యారు. రైతుల సమస్యలు వినడంతో పాటు కేంద్ర సాయం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను CM వారికి వివరించనున్నారు. మిర్చి ధర కొంత కాలంగా తగ్గుతుండటంతో రైతులను ఆదుకునేందుకు సీఎం ఇటీవల ఢిల్లీ కూడా వెళ్లిన విషయం తెలిసిందే. శ్రీలంక, మలేషియా, చైనాలో మిర్చి పంట సరిగా రాకపోవడంతో ఆ దేశాలకు అధిక ధరలకు ఎగుమతి చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Similar News

News December 4, 2025

రూ.50లక్షలతో మూవీ తీస్తే రూ.100కోట్లు వచ్చాయ్!

image

గుజరాతీ సినిమా చరిత్రలో ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ చిత్రం రికార్డు సృష్టించింది. కేవలం ₹50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 19,900% ప్రాఫిట్స్‌తో రూ.100 కోట్లు వసూలు చేసినట్లు సినీవర్గాలు వెల్లడించాయి. పెద్ద స్టార్లు, భారీ బడ్జెట్ లేకపోయినా కథలో బలం, మౌత్ టాక్ ద్వారా సినిమా ఇంతటి విజయం సాధించిందని తెలిపాయి. కాగా రిలీజైన ఏడో వారం కూడా థియేటర్లు కిటకిటలాడుతున్నాయి.

News December 4, 2025

బత్తాయిలో తొడిమ కుళ్లు నివారణకు సూచనలు

image

బత్తాయిలో తొడిమ కుళ్లు నివారణకు లీటరు నీటికి కాపర్ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1గ్రాము కలిపి పిచికారీచేయాలి. తొడిమ కుళ్లు సోకి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. ఏటా తొలకరిలో ఎండుపుల్లలను కత్తిరించి దూరంగా పారేయాలి. శిలీంధ్రాలకు ఆశ్రయమిచ్చే కలుపు మొక్కల కట్టడికి మల్చింగ్ విధానం అనుసరించాలి. కలుపు మందులు, రసాయన ఎరువులను పరిమితంగా వాడుతూ, తోటల్లో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

News December 4, 2025

పుతిన్ భారత పర్యటన షెడ్యూల్

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ సాయంత్రం 6.35 గం.కు ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు 11AMకు రాష్ట్రపతి భవన్‌లో స్వాగత కార్యక్రమం ఉంటుంది. 11.30AMకు మహాత్మాగాంధీ సమాధి (రాజ్‌ఘాట్) వద్ద నివాళి అర్పిస్తారు. 11.50AMకు ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చిస్తారు. 1.50PMకు మీడియా సమావేశం ఉంటుంది. 3.40PMకు బిజినెస్ ఈవెంట్, 7PMకు రాష్ట్రపతి ముర్ముతో సమావేశంలో పాల్గొంటారు.