News January 24, 2025
కేంద్రమంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించారు. ఆర్థికసాయం అందించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. అమరావతికి హడ్కో రుణం, వరల్డ్ బ్యాంక్ సాయం వంటి అంశాలనూ కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. అనంతరం రామ్నాథ్ కోవింద్తోనూ బాబు భేటీ అవుతారు.
Similar News
News February 11, 2025
1,036 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

రైల్వే మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి ఆర్ఆర్బీ దరఖాస్తు గడువును పొడిగించింది. వివిధ విభాగాల్లో మొత్తం 1,036 పోస్టులకు ఈ నెల 16 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, పీజీ అర్హత కలిగి ఉండాలి. ఆన్లైన్ పరీక్ష, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్ సైట్: www.rrbapply.gov.in
News February 11, 2025
TODAY TOP STORIES

* ఏపీలో లిక్కర్ ధరలు పెంపు!
* ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక: రేవంత్
* 20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్: చంద్రబాబు
* TGలో రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు
* రేవంత్ రాజీనామా చేసి రా: KTR సవాల్
* YCP టార్గెట్గా పృథ్వీ సెటైర్లు.. క్షమాపణ చెప్పిన విశ్వక్ సేన్
* చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్ మాథ్యూ బ్రిట్జ్కే
* ప్రశాంతంగా పరీక్షలకు ప్రిపేర్ కావాలి: మోదీ
News February 11, 2025
మీకూ గాఢ నిద్రలో ఇలా జరుగుతోందా?

కొందరు రాత్రి పూట గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏడుస్తుంటారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇష్టమైనవారు చేజారిపోతున్నట్లు, మరణిస్తున్నట్లు కల వస్తే ఏడుస్తారు. జీవితంలో మానసిక దెబ్బలు తిన్నవారు కూడా అసంకల్పితంగా నిద్రలో ఏడుస్తుంటారు. అణిచిపోయిన భావోద్వేగాలతోనూ నిద్రలో ఏడ్చే అవకాశం ఉంది. బైపోలార్ డిజార్డర్, స్లీప్ ఆప్నియా, ఇన్సోమ్నియా, మూడ్ స్వింగ్స్ ఉన్నవారూ ఇలాగే ప్రవర్తిస్తారు.