News August 21, 2025
సాయంత్రం ఢిల్లీకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి బయల్దేరనున్నారు. రేపు మ.2 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన భేటీ అవుతారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆమెకు వివరించి ఆర్థిక సాయం కోరనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఓ ప్రైవేటు హోటల్లో ఎకనమిక్ టైమ్స్ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు సీఎం హాజరవుతారు. రాత్రి అమరావతికి తిరుగు పయనమవుతారు.
Similar News
News August 21, 2025
ఎమ్మెల్యే దగ్గుపాటికి సీఎం హెచ్చరిక

AP: ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకున్న అనంతపురం(U) MLA దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ CM చంద్రబాబుని కలిశారు. తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై MLA నుంచి CM వివరణ తీసుకున్నారు. పద్ధతి మార్చుకోవాలని, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. TDPలో క్రమశిక్షణ తప్పితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అటు <<17432318>>NTRను <<>>తాను దూషించలేదని, ఈ అంశంలో తనను ఇరికించారని MLA సంజాయిషీ ఇచ్చినట్లు సమాచారం.
News August 21, 2025
ఇంటర్ ప్రైవేటుగా రాసే విద్యార్థులకు ALERT

AP: కాలేజీకి వెళ్లకుండా ప్రైవేటుగా 2026లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇంటర్ బోర్డు కీలక సూచన చేసింది. హాజరు నుంచి మినహాయించేలా అనుమతి పొందడానికి AUG 22 నుంచి SEP 26 వరకు దరఖాస్తు చేయాలని సూచించింది. అలాగే సబ్జెక్టుల మినహాయింపు, గ్రూప్ మార్పు కోరుకునే విద్యార్థులు స్థానిక ప్రభుత్వ జూ.కాలేజీల్లో టెన్త్ సర్టిఫికెట్, TCలతో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. ఆ తర్వాతే పరీక్ష ఫీజు చెల్లించాలంది.
News August 21, 2025
భారత్తో విరోధం USకి మంచిది కాదు: నిక్కీ హేలీ

భారత్ను శత్రువుగా చూడటం ట్రంప్ విదేశాంగ పాలసీ స్ట్రాటజీల్లోనే బిగ్ డిజాస్టర్ అని US మాజీ రాయబారి నిక్కీ హేలీ పేర్కొన్నారు. ‘చైనా తరహాలో భారత్ని ప్రత్యర్థిగా కాదు.. మిత్ర దేశంలా చూడాలి. అన్ని విధాలుగా ఆసియా ఖండంలో చైనాకు చెక్ పెట్టగల సామర్థ్యం భారత్కే ఉంది. కమ్యూనిస్ట్స్ నియంత్రణలో నడిచే చైనాతో పోలిస్తే.. ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఎదుగుదల ప్రపంచానికి ఎలాంటి హానీ చేయదు’ అని వ్యాఖ్యానించారు.