News March 1, 2025

పథకాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

image

AP: తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ మే నెలలో రూ.15,000 చొప్పున ఇస్తామని ప్రకటించారు. GD నెల్లూరులో మాట్లాడుతూ.. పిల్లల ఖర్చుల బాధలు తగ్గించే బాధ్యత తామే తీసుకుంటామన్నారు. ‘త్వరలోనే ఒక్కో రైతుకు రూ.20వేలు ఆర్థిక సాయం చేస్తాం. మత్స్యకార కుటుంబాలకు రూ.20వేల చొప్పున అందజేస్తాం. జూన్‌ నాటికి DSC ప్రక్రియ పూర్తి చేస్తాం’ అని పునరుద్ఘాటించారు.

Similar News

News March 1, 2025

నేలపై కూర్చుని తింటున్నారా?

image

డైనింగ్ టేబుల్ కాకుండా నేల మీద కూర్చుని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘ప్లేట్‌లోని ఆహారాన్ని వంగి తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. కండరాలు, శారీరక నొప్పులు దూరమవుతాయి. భోజనం ఎంత తింటున్నామో జ్ఞప్తిలో ఉంటుంది. తద్వారా బరువును కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. నేలపై కూర్చుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది’ అని పేర్కొంటున్నారు.* మీరు ఎలా తింటారు? కామెంట్ చేయండి.

News March 1, 2025

మ్యాచులు రద్దు.. టికెట్ డబ్బులు రీఫండ్: PCB

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈనెల 25, 27న రావల్పిండిలో జరగాల్సిన మ్యాచులు టాస్ పడకుండానే రద్దయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచుల కోసం టికెట్లు కొన్న ప్రేక్షకులకు పూర్తి డబ్బులను రీఫండ్ చేయనున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. డ్యామేజ్ అవని ఒరిజినల్ టికెట్లతో వచ్చి టికెట్ సెంటర్ల వద్ద డబ్బులు తీసుకోవాలని సూచించింది. బాక్సెస్, గ్యాలరీ టికెట్లు తీసుకున్న వారికి రీఫండ్ వర్తించదని పేర్కొంది.

News March 1, 2025

వారికి రేపటి నుంచి ఒంటి పూట బడులు

image

TG: నెలవంక కనిపించడంతో రేపటి నుంచి <<15622646>>రంజాన్ మాసం<<>> ప్రారంభం కానుంది. దీంతో ఉర్దూ మీడియం విద్యార్థులకు రేపటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉ.8 నుంచి మ.1.30 వరకు క్లాసులు కొనసాగుతాయని తెలిపారు. కాగా మిగతా విద్యార్థులకు మార్చి 10 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించే యోచనలో సర్కారు ఉంది. APలో ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు ఆరంభం కానున్నాయి.

error: Content is protected !!