News March 1, 2025

పథకాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

image

AP: తల్లికి వందనం పథకంపై సీఎం చంద్రబాబు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ మే నెలలో రూ.15,000 చొప్పున ఇస్తామని ప్రకటించారు. GD నెల్లూరులో మాట్లాడుతూ.. పిల్లల ఖర్చుల బాధలు తగ్గించే బాధ్యత తామే తీసుకుంటామన్నారు. ‘త్వరలోనే ఒక్కో రైతుకు రూ.20వేలు ఆర్థిక సాయం చేస్తాం. మత్స్యకార కుటుంబాలకు రూ.20వేల చొప్పున అందజేస్తాం. జూన్‌ నాటికి DSC ప్రక్రియ పూర్తి చేస్తాం’ అని పునరుద్ఘాటించారు.

Similar News

News October 29, 2025

ప్రజలు తినే పంటలు పండిస్తే మంచిది: CBN

image

AP: రాయలసీమలో వరికాకుండా ఇతర పంటలు పండిస్తున్నారని, కోస్తాలో కూడా తినేరకాలు పండించాలని CBN రైతులకు సూచించారు. ‘పంటకు ఫలితం ఉండాలంటే తినే వాళ్లుండాలి. ప్రజలు తినని వాటిని పండిస్తే లాభమేంటి? ఇప్పటికే ధాన్యం వాడకం తగ్గిపోతోంది’ అని చెప్పారు. అలా చేయకుండా తనను ఎన్ని తిట్టినా ఫలితం లేదన్నారు. కార్బోహైడ్రేట్స్ ఉండే రైస్ తినకూడదని దానివల్లే అందరికీ షుగర్ అని అన్నారు. కోనసీమలో పంటల్ని CM పరిశీలించారు.

News October 29, 2025

మెదడు ఎదుగుదలలో తల్లిపాల పాత్ర

image

తల్లిపాలు బిడ్డ ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఎన్నో పోషకాలతో నిండి ఉండే తల్లిపాలు బిడ్డ ఎదుగుదలకు ఎంతో దోహదం చేస్తాయి. అయితే శిశువుల వివిధ దశల్లో మెదడు ఎదుగుదలకు అనుగుణంగా చనుబాలలోని పోషకాల మోతాదులు మారిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. తొలినెలల్లో తల్లిపాలలో మేయో-ఇనాసిటోల్‌ పెద్దమొత్తంలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది బిడ్డ మెదడులో నాడీఅనుసంధానాలకు తోడ్పడుతోంది.

News October 29, 2025

AUSతో తొలి 3 టీ20లకు నితీశ్ దూరం

image

టీమ్ఇండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ ఆస్ట్రేలియాతో మూడు టీ20లకు దూరమయ్యారు. ఆయన గాయం నుంచి కోలుకునేందుకు కాస్త సమయం పడుతుందని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం ఆయన మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నట్లు పేర్కొంది. అయితే ఆయన స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది వెల్లడించలేదు. ఆస్ట్రేలియాతో ఆడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో నితీశ్ <<18098198>>గాయపడిన<<>> సంగతి తెలిసిందే.