News December 31, 2024
నేడు పల్నాడుకు సీఎం చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. నరసరావుపేట నియోజకవర్గం యలమందల గ్రామంలో పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న ఆయన వి.ఏడుకొండలు, తలారి శారమ్మ ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందజేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గ్రామస్థులతో సీఎం ముచ్చటిస్తారని, అందుకోసం వేదిక ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాయి. అనంతరం CM కోటప్పకొండ వెళ్లి త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారని పార్టీ నేతలు తెలిపారు.
Similar News
News January 14, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ పబ్లిక్ టాక్
వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం యూఎస్లో ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. సినిమాలో కామెడీ అదిరిపోయిందని, వెంకీ నటన ఇరగదీశారని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. స్టోరీ అంతగా లేదని, లాజిక్స్ వెతకకుండా చూస్తే ఫ్యామిలీ ఆడియన్స్ను మెప్పిస్తుందని చెబుతున్నారు. మరికాసేపట్లో WAY2NEWS రివ్యూ.
News January 14, 2025
నాలుగు పథకాలకు రూ.45వేల కోట్లు: భట్టి
TG: రాష్ట్రంలో కొత్తగా తీసుకురానున్న 4 సంక్షేమ పథకాల కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వీటిలో ఇందిరమ్మ ఇళ్లకు రూ.22,500 కోట్లు, రైతు భరోసాకు రూ.18వేల కోట్లు వెచ్చించనున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ కోసం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అర్హులందరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
News January 14, 2025
క్రేజీ.. మహా కుంభమేళాలో ‘అఖండ-2’ షూట్
సంగీత దర్శకుడు తమన్ ‘అఖండ-2’ మూవీ గురించి అదిరిపోయే అప్టేడ్ ఇచ్చారు. యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాలో ఈ మూవీ షూటింగ్ జరగనుందని ట్వీట్ చేశారు. కాగా ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్ట్-1 సూపర్ హిట్ అవ్వగా పార్ట్-2పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదలైన బాలయ్య ‘డాకు మహారాజ్’ పాజిటివ్ సొంతం చేసుకుంది.