News April 24, 2024
సీఎం జగన్ రేపటి బస్సు యాత్ర షెడ్యూల్

AP: CM జగన్ రేపటి బస్సు యాత్ర షెడ్యూల్ను వైసీపీ విడుదల చేసింది. 21వ రోజు యాత్రలో భాగంగా ఎంవీవీ సిటీ నుంచి రేపు ఉ.9 గంటలకు బయల్దేరి మధురవాడ, ఆనందపురం చేరుకుని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో CM భేటీ అవుతారు. అనంతరం తగరపువలస మీదుగా జొన్నాడ, బొద్దవలస మీదుగా చెల్లూరు చేరుకుని సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం, అక్కివలస చేరుకుంటారు.
Similar News
News February 4, 2026
పవన్ను కలిసిన రాజేంద్ర ప్రసాద్

AP: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇవాళ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాజేంద్ర ప్రసాద్కు పద్మశ్రీ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. రాజేంద్ర ప్రసాద్ను పవన్ అభినందించారు.
News February 4, 2026
అఫ్గాన్పై ఘన విజయం.. ఫైనల్కు భారత్

U19WCలో టీమ్ ఇండియా ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్లో అఫ్గాన్పై 7 వికెట్ల తేడాతో గెలిచింది. 41.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని(311) ఛేదించింది. జార్జ్(115) శతకంతో చెలరేగారు. వైభవ్ సూర్యవంశీ(68), ఆయుశ్ మాత్రే(62), విహాన్ మల్హోత్రా(38) అదరగొట్టారు. కుర్రాళ్లను కట్టడి చేయడంలో అఫ్గాన్ బౌలర్లు చేతులెత్తేశారు. నూరిస్తానీ 2, జద్రాన్ 1 వికెట్ మాత్రమే తీశారు. FEB 6న ENG-19, IND-19 ఫైనల్లో తలపడనున్నాయి.
News February 4, 2026
డ్వాక్రా ఉత్పత్తుల బ్రాండ్ నేమ్ ‘స్వయం’

AP: డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కల్పించాల్సిన అవసరముందని CM CBN పేర్కొన్నారు. సచివాలయంలో డ్వాక్రా ఉత్పత్తులకు బ్రాండింగ్ కోసం వివిధ లోగోలు, పేర్లను CM పరిశీలించారు. ‘‘స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తులను తయారు చేస్తున్నందున ‘స్వయం’ అనే పేరు బాగుంటుంది. లోగో కూడా అదే డిజైన్తో ఉండాలి’’ అని సూచించారు. బ్రాండ్ పేరు, లోగోతోనే కాన్సెప్ట్ అర్థమయ్యేలా ఉండాలన్నారు.


