News April 24, 2024
సీఎం జగన్ రేపటి బస్సు యాత్ర షెడ్యూల్

AP: CM జగన్ రేపటి బస్సు యాత్ర షెడ్యూల్ను వైసీపీ విడుదల చేసింది. 21వ రోజు యాత్రలో భాగంగా ఎంవీవీ సిటీ నుంచి రేపు ఉ.9 గంటలకు బయల్దేరి మధురవాడ, ఆనందపురం చేరుకుని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో CM భేటీ అవుతారు. అనంతరం తగరపువలస మీదుగా జొన్నాడ, బొద్దవలస మీదుగా చెల్లూరు చేరుకుని సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం, అక్కివలస చేరుకుంటారు.
Similar News
News December 12, 2025
IMF షరతులతో పాక్ ఉక్కిరిబిక్కిరి

పాకిస్థాన్కు విడతల వారీగా నిధులు విడుదల చేస్తామని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF) 7 బిలియన్ డాలర్లు బెయిలవుట్ ప్యాకేజీని ప్రకటించింది. అలాగే దశలవారీగా కండిషన్స్ కూడా పెడుతోంది. తాజాగా మరో 11 షరతులు పెట్టడంతో మొత్తం నిబంధనల సంఖ్య 64కు చేరింది. వీటిని 18 నెలల్లో అమలు చేయాలి. వీటిలో మొదటిది కరప్షన్ కట్టడికై కేంద్ర ప్రభుత్వ అధికారుల ఆస్తుల వివరాలు ఈ ఏడాది చివరినాటికి ప్రకటించేలా డెడ్ లైన్ విధించింది.
News December 12, 2025
సలీల్ అరోరా.. 39 బంతుల్లోనే సెంచరీ

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మరో శతకం నమోదైంది. ఝార్ఖండ్తో మ్యాచ్లో పంజాబ్ బ్యాటర్ సలీల్ అరోరా కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేశారు. సలీల్ చేసిన 125 రన్స్లో 102(11 సిక్సులు, 9 ఫోర్స్) పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి. అటు 19వ ఓవర్లో సలీల్, గౌరవ్ రెచ్చిపోయారు. వరుసగా 4, 6, 6, 1, 6, 4(27 రన్స్) బాదేశారు. IPLలో అరోరా వికెట్ కీపర్ కేటగిరీలో రూ.30 లక్షల బేస్ ప్రైస్తో లిస్ట్ అయ్యి ఉన్నారు.
News December 12, 2025
పొగమంచు వేళల్లో వాహనాల రాకపోకలపై నిషేధం: అనిత

AP: ఏజెన్సీ ప్రాంతాల్లో వాహన ప్రమాదాల నేపథ్యంలో రాత్రి పూట పొగమంచు వేళల్లో బస్సు, ఇతర వాహన రాకపోకలను నిషేధిస్తున్నట్లు మంత్రి అనిత తెలిపారు. చింతూరు-మారేడుమిల్లి రోడ్డులో BUS ప్రమాదంలో 9మంది మృతి బాధాకరమన్నారు. ‘మృతుల కుటుంబాలకు పరిహారమిస్తాం. ఘాట్ రోడ్లలో వాహనాలు నడిపేవారికి ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్ ఉండేలా చర్యలు తీసుకుంటాం. చిన్న తప్పిదాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు.


