News May 12, 2024
బెంగాల్ గవర్నర్కు సీఎం మమత హెచ్చరిక

పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్కు ఆ రాష్ట్ర సీఎం మమత బెనర్జీ హెచ్చరికలు జారీ చేశారు. ‘రాష్ట్రంలో దీదీగిరి పనిచేయదని ఆయన అంటున్నారు. కానీ మీ దాదాగిరి కూడా పనిచేయదు గవర్నర్. మీరు ఉన్నంత వరకు నేను రాజ్భవన్లో అడుగు కూడా పెట్టను. మీ ప్రవర్తన సిగ్గు చేటు. లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తిన తర్వాత కూడా ఎందుకు రాజీనామా చేయట్లేదో చెప్పండి’ అని స్పష్టం చేశారు.
Similar News
News March 14, 2025
బోరుగడ్డకు 14 రోజుల రిమాండ్

AP: రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్కు కోర్టు రిమాండ్ విధించింది. జైలులో లొంగిపోయిన ఆయనను పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్న చిలకలపూడి పోలీసులు అదనపు జిల్లా జడ్జి ముందు హాజరుపరిచారు. చిలకలపూడి పీఎస్లో నమోదైన కేసుల్లో అనిల్కు ఈ నెల 27 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
News March 14, 2025
ఈ రోజు నమాజ్ వేళలు

మార్చి 14, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 5.13 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.25 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు
ఇష: రాత్రి 7.38 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 14, 2025
IMLT20: సెమీస్లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20 సెమీఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియాపై భారత జట్టు ఘన విజయం సాధించి ఫైనల్ దూసుకెళ్లింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా మాస్టర్స్ 20 ఓవర్లలో 220 పరుగులు చేసింది. యువరాజ్(59), టెండూల్కర్(42), బిన్నీ(36) అదరగొట్టారు. ఛేదనలో భారత బౌలర్లు నదీమ్(4), వినయ్(2), పఠాన్(2) విజృంభించడంతో ఆస్ట్రేలియా 126 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇండియా మాస్టర్స్ ఫైనల్లోకి ప్రవేశించింది.