News May 12, 2024
బెంగాల్ గవర్నర్కు సీఎం మమత హెచ్చరిక

పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్కు ఆ రాష్ట్ర సీఎం మమత బెనర్జీ హెచ్చరికలు జారీ చేశారు. ‘రాష్ట్రంలో దీదీగిరి పనిచేయదని ఆయన అంటున్నారు. కానీ మీ దాదాగిరి కూడా పనిచేయదు గవర్నర్. మీరు ఉన్నంత వరకు నేను రాజ్భవన్లో అడుగు కూడా పెట్టను. మీ ప్రవర్తన సిగ్గు చేటు. లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తిన తర్వాత కూడా ఎందుకు రాజీనామా చేయట్లేదో చెప్పండి’ అని స్పష్టం చేశారు.
Similar News
News February 19, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ: విజేతలు వీరే

* 1998- దక్షిణాఫ్రికా
* 2000- న్యూజిలాండ్
* 2002- భారత్ & శ్రీలంక(సంయుక్తం)
* 2004- వెస్టిండీస్
* 2006- ఆస్ట్రేలియా
* 2009- ఆస్ట్రేలియా
* 2013- భారత్
* 2017- పాకిస్థాన్
News February 19, 2025
2 రోజులు సెలవు

AP: పట్టభద్రుల, టీచర్స్ MLC స్థానాలకు ఎన్నికలు జరిగే జిల్లాల్లో(ఉమ్మడి గోదావరి జిల్లాలు, గుంటూరు-కృష్ణా గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్ర టీచర్స్) 2 రోజులు సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. పోలింగ్ ముందు రోజు FEB 26, పోలింగ్ రోజైన 27 తేదీల్లో సెలవు ఇవ్వాలని, అవసరమైతే కౌంటింగ్(MAR 3) రోజునా సెలవు ఇవ్వాలని పేర్కొన్నారు. మొత్తం 16 జిల్లాల్లో MLC ఎన్నికల పోలింగ్ జరగనుంది.
News February 19, 2025
నేడు గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు మిర్చి యార్డ్కు చేరుకోనున్నారు. మిర్చికి గిట్టుబాటు ధరను డిమాండ్ చేస్తూ అక్కడి రైతులకు సంఘీభావం తెలుపనున్నారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ పర్యటనకు ఈసీ నుంచి ఎలాంటి స్పందన ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్త ఫీజు పోరు నిరసనల్ని కోడ్ దృష్ట్యా వైసీపీ వాయిదా వేసుకుంది.