News March 6, 2025
విద్యకు దూరమైన బాలిక.. స్పందించిన సీఎం

TG: బర్త్ సర్టిఫికెట్, ఆధార్ లేదంటూ HYD సనత్నగర్కు చెందిన శ్రీవిద్య(8)ను స్కూలులో చేర్చుకోలేదన్న వార్తపై CM రేవంత్ స్పందించారు. ‘శ్రీవిద్య సమస్య నా దృష్టికి వచ్చింది. ఆమె పాఠశాలకు వెళ్లకపోవడానికి ఆధార్ లేకపోవడం కారణం కాదని విచారణలో తేలింది. కుటుంబ కారణాల వల్లే ఆమె స్కూలుకు దూరమైంది. అధికారులు ఆమెను తిరిగి స్కూలులో చేర్పించారు. తను మంచిగా చదివి భవిష్యత్తులో గొప్పగా రాణించాలి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News March 7, 2025
అల్లు అర్జున్, స్నేహా బంధానికి పద్నాలుగేళ్లు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి తమ పద్నాలుగో పెళ్లి రోజు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారాయి. ఇవి చూసిన ఫ్యాన్స్ తెగ సంతోష పడిపోతున్నారు. 2011లో స్నేహాను బన్నీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి అయాన్, అర్హ ఇద్దరు పిల్లలు ఉన్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ తెరకెక్కించబోయే సినిమా కోసం సిద్ధంగా ఉన్నట్లు టాక్.
News March 7, 2025
పంజాబ్ కింగ్స్ న్యూ జెర్సీ చూశారా?

ఐపీఎల్ 2025 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. మెటాలిక్ ఎంబ్లమ్, గోల్డ్ కాలర్, గోల్డ్ ఫాయిల్ స్ట్రిప్స్, అథెంటిక్ లేబుల్తో జెర్సీ సరికొత్తగా ఉంది. రెడ్ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ హెల్మెట్తో కిట్ను విభిన్నంగా రూపొందించారు. కాగా తమ జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను ఆ ఫ్రాంచైజీ నియమించిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో ఆయన జట్టును ముందుండి నడిపించనున్నారు.
News March 7, 2025
మార్చి 7: చరిత్రలో ఈరోజు

1921: తెలుగు సినిమా తొలి నేపథ్య గాయకుడు ఎమ్.ఎస్. రామారావు జననం
1938: నోబెల్ గ్రహీత, అమెరికా జీవశాస్త్రవేత్త డేవిడ్ బాల్టిమోర్ జననం
1952: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ జననం
1955: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ జననం
1952: ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానంద మరణం
1979: గ్రంథాలయోద్యమకారుడు అయ్యంకి వెంకటరమణయ్య మరణం