News July 8, 2024

నేడు విజయవాడకు సీఎం రేవంత్, మంత్రులు

image

TG: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు. ఏపీ కాంగ్రెస్ నిర్వహిస్తున్న వైఎస్ఆర్ 75వ జయంతి సభకు ఆయనతో పాటు డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

Similar News

News December 11, 2025

AUS ప్రపంచ కప్ టీమ్‌లో భారత సంతతి ప్లేయర్లు

image

ICC మెన్స్ U19 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా 15 మందితో జట్టును ప్రకటించింది. ఇందులో ఇద్దరు భారత సంతతి క్రికెటర్లు చోటుదక్కించుకున్నారు. ఆర్యన్ శర్మ(ఫొటోలో), జాన్ జేమ్స్ అనే యువ ఆటగాళ్లు ఇటీవల INDతో జరిగిన యూత్ టెస్టులు, వన్డేల్లో అదరగొట్టారు. దీంతో తాజాగా ప్రపంచ కప్‌కు ఎంపికయ్యారు. శ్రీలంక, చైనా మూలాలున్న ప్లేయర్లు సైతం జట్టులో ఉండటం గమనార్హం. ఈ టోర్నీ జనవరి 15 నుంచి నమీబియా, జింబాబ్వేలో జరగనుంది.

News December 11, 2025

పిల్లలకు SM బ్యాన్ చేయాలి: సోనూసూద్

image

AUS తరహాలో INDలోనూ U16 పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నటుడు సోనూసూద్ కూడా ఇదే విషయాన్ని Xలో పోస్ట్ చేశారు. పిల్లలు స్క్రీన్ అడిక్షన్‌కు దూరమై నిజమైన బాల్యాన్ని గడపాలని, కుటుంబ బంధాలు బలపడాలని ఆయన పేర్కొన్నారు. దీనికి నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తోంది. అయితే పేరెంట్స్ ఫోన్లకు అతుక్కుపోతుంటే పిల్లలెలా మారుతారని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ COMMENT.

News December 11, 2025

ఇంటర్వ్యూతో ESICలో ఉద్యోగాలు

image

ESIC పట్నా 36 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 12న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, MS, DNB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.500, SC,STలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in