News June 25, 2024
ముగ్గురు కేంద్రమంత్రులకు సీఎం రేవంత్ విన్నపాలు

HYDలో 2450 ఎకరాల రక్షణ శాఖ భూమిని రాష్ట్రానికి బదిలీ చేస్తే రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రాజ్నాథ్ సింగ్కు CM రేవంత్ విన్నవించారు. TGకి 2.70లక్షల ఇళ్లను మంజూరు చేయాలని మనోహర్లాల్ ఖట్టర్ను కోరారు. PMAY(U) కింద గ్రాంటుగా రూ.78,488 కోట్ల బకాయిలు ఇవ్వాలని ప్రతిపాదించారు. అలాగే జాతీయ ఆరోగ్య మిషన్ కింద TGకి రావాల్సిన రూ.693.13 కోట్లు విడుదల చేయాలని JP నడ్డాకు విజ్ఞప్తి చేశారు.
Similar News
News February 11, 2025
కృష్ణా జిల్లాలోనూ బర్డ్ఫ్లూ.. చికెన్, గుడ్లు తినొద్దని అధికారుల ఆదేశాలు

AP: ఉ.గో జిల్లాల్లో కల్లోలం సృష్టిస్తోన్న <<15428552>>బర్డ్ ఫ్లూ<<>> కృష్ణా జిల్లాకూ విస్తరించింది. గంపలగూడెం(M)లో వైరస్ నిర్ధారణ అయ్యింది. 2 రోజుల్లోనే 10వేలకు పైగా కోళ్లు మృతి చెందాయి. వైరస్ సోకిన కోళ్లను నాశనం చేయాలని అధికారులు ఆదేశించారు. ఆ చుట్టుపక్కల 10KM పరిధిలో చికెన్, గుడ్లు తినొద్దని ప్రజలకు సూచించారు. కాగా 100డిగ్రీల ఉష్ణోగ్రతలో మాంసాన్ని ఉడికిస్తే ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు.
News February 11, 2025
18వేల ఏళ్ల క్రితం యూరప్లో నరమాంస భక్షణ

సుమారు 18వేల ఏళ్ల క్రితం యూరప్లో నరమాంస భక్షణ జరిగేదని UK పరిశోధకులు తెలిపారు. పోలాండ్లోని ఓ గుహలో దొరికిన అవశేషాలపై అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందన్నారు. ‘ఆ ఎముకల మీద ఉన్న గుర్తుల్ని బట్టి అవి నరమాంస భక్షణకు గురైనట్లుగా గుర్తించాం. కాళ్లూచేతుల్ని ముక్కలుగా నరకడం, మెదడును బయటికి తీయడం వంటి పలు ఆనవాళ్లు వాటిపై ఉన్నాయి. 2 గ్రూపుల మధ్య యుద్ధంలో విజేతలు ఓడినవారిని తినేసి ఉండొచ్చు’ అని అంచనా వేశారు.
News February 11, 2025
ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్లోని ఎల్వోసీ వద్ద ఐఈడీ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మరణించగా మరికొందరు గాయపడ్డారు. అఖ్నూర్ సెక్టార్లోని ఫెన్సింగ్ వద్ద భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది.