News December 13, 2024

కేంద్ర మంత్రి నిర్మలతో సీఎం రేవంత్ భేటీ

image

రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విధంగా TGలోని వెనుక‌బ‌డిన జిల్లాల‌కు పెండింగ్‌లో ఉన్న ₹1800కోట్ల గ్రాంటును విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రి నిర్మలను CM రేవంత్ కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో చేప‌ట్టిన ప్రాజెక్టుల‌కు సంబంధించి AP, TG మ‌ధ్య రుణాల పంపిణీ విష‌యంలో TG నుంచి ₹2547cr రిక‌వ‌రీకి కేంద్రం ఏక‌ప‌క్షంగా ఆదేశాలిచ్చింద‌ని, దీనిపై మరోసారి స‌మీక్షించి స‌రైన నిర్ణ‌యం తీసుకోవాల‌ని విజ్ఞప్తి చేశారు.

Similar News

News January 17, 2025

రెచ్చిపోయిన దొంగలు.. కర్ణాటకలో మరో భారీ చోరీ

image

కర్ణాటకలో మరో భారీ చోరీ జరిగింది. దక్షిణ కన్నడ జిల్లాలోని ఉల్లాల్‌లో బ్యాంకులోకి చొరబడిన దొంగల ముఠా నగదు, బంగారం ఎత్తుకెళ్లింది. కారులో వచ్చి బ్యాంకు సిబ్బందిని తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. నిన్న బీదర్‌లోనూ దొంగల ముఠా ఏటీఎంలో క్యాష్ లోడ్ చేసే వాహనం సిబ్బందిపై <<15169507>>కాల్పులు<<>> జరిపి రూ.93 లక్షలు ఎత్తుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు మరణించారు.

News January 17, 2025

‘వీరమల్లు’ లాంటి కథలు అరుదుగా వస్తాయి: బాబీ డియోల్

image

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ స్క్రిప్ట్ చాలా ప్రత్యేకమని బాబీ డియోల్ తెలిపారు. ఇలాంటి కథలు అరుదుగా వస్తాయని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చరిత్రలో జరిగిన కథలు ఎమోషనల్‌గానే కాకుండా మాస్‌గానూ ఉంటాయని ఈ స్టోరీ విన్నప్పుడే అర్థమైందన్నారు. ఇలాంటి చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఇవాళ మూవీ నుంచి ‘మాట వినాలి’ అంటూ సాగే సాంగ్ విడుదలైంది.

News January 17, 2025

ఫొటోలతో అనుబంధాన్ని వ్యక్తపరిచారు!

image

సంసార జీవితం పదికాలాల పాటు సాగాలంటే ఆ జంట మధ్య అన్యోన్యత పరిఢవిల్లాలి అని చెబుతుంటారు. అయితే, ఆ అన్యోన్యత ఎలా చూపించాలనే దానికి ఓ జంట కొత్త అర్థాన్ని చూపింది. 12 ఏళ్ల క్రితం కలిసిన ఈ జంట ఏటా ఓ ఫొటో దిగుతూ వారి మధ్య ఉన్న అన్యోన్యతను చూపుతూ వచ్చింది. వీరిద్దరికీ ఓ పాప జన్మించగా ఆమెతోనూ ఫొటోకు పోజులిస్తూ వచ్చారు. ఇలా ఒక్క మాట మాట్లాడకుండా వారి మధ్య ఉన్న బంధాన్ని వ్యక్తపరిచారు.