News October 7, 2024
కేంద్ర మంత్రులతో CM రేవంత్ భేటీ

ఢిల్లీలో ఉన్న CM రేవంత్ కేంద్ర మంత్రులు అమిత్ షా, మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ అయ్యారు. మెట్రో రెండో దశ విస్తరణ, మూసీ ప్రక్షాళన వంటి పనులకు సహాకారం అందించాలని కోరారు. CSMPని అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక సాయం చేయాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. HYDలో పురాతన మురుగుశుద్ధి వ్యవస్థ ఉందని, అది ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా లేదని వివరించారు.
Similar News
News November 1, 2025
ఢిల్లీలో వాయు కాలుష్యంతో 17,188 మరణాలు

ఢిల్లీలో సంభవించిన మరణాల్లో ఏడింటిలో ఒక మరణానికి వాయుకాలుష్యమే కారణంగా ఉంది. 2023లో వాయుకాలుష్యం వల్ల 17,188(15%) మంది మరణించినట్లు ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్ అండ్ ఎవాల్యూయేషన్(IHME) నివేదిక తెలిపింది. అదే ఏడాది హైబీపీతో 12.5%, మధుమేహంతో 9శాతం, అధిక కొలెస్ట్రాల్తో 6%, ఊబకాయంతో 5.6శాతం మరణాలు చోటు చేసుకున్నాయి. 2018-24 మధ్య కాలంలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ ఉంది.
News November 1, 2025
కాశీబుగ్గ ఘటన.. మృతులు వీరే

AP: 1.ఏడూరి చిన్నమ్మి(50)-రామేశ్వరం(టెక్కలి), 2.రాపాక విజయ(48)-పిట్టలసరి(టెక్కలి), 3.మురిపింటి నీలమ్మ(60)-దుక్కవానిపేట-పల్లిఊరు(వజ్రపుకొత్తూరు), 4.దువ్వు రాజేశ్వరి(60)-బెలుపతియా(మందస), 5.చిన్ని యశోదమ్మ(56)-శివరాంపురం(నందిగం), 6.రూప-గుడ్డిభద్ర(మందస), 7.లోట్ల నిఖిల్(13)-బెంకిలి(సోంపేట), 8.డొక్కర అమ్ముదమ్మ-పలాస, 9.బోర బృందావతి(62)- మందస. మరో వ్యక్తి ఆస్పత్రిలో మృతిచెందగా వివరాలు తెలియాల్సి ఉంది.
News November 1, 2025
చంద్రబాబువి పిట్టలదొర మాటలు: జగన్

AP: తుఫాను నిర్వహణపై CM చంద్రబాబువి పిట్టలదొర మాటలని YCP చీఫ్ జగన్ ఎద్దేవా చేశారు. ‘వైపరీత్యాల వేళ రైతులకు శ్రీరామరక్షగా నిలిచే ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దుచేయడం బెటర్ మేనేజ్మెంట్ అవుతుందా? మొంథా తుఫాను వల్ల నష్టపోయిన బీమాలేని రైతులకు దిక్కెవరు? మీ 18నెలల కాలంలో 16సార్లు వైపరీత్యాల వల్ల రైతులు నష్టపోతే రూ.600CR ఇన్ పుట్ సబ్సిడీ బకాయి పెట్టారు. ఒక్కపైసా పంట నష్ట పరిహారం ఇవ్వలేదు’ అని ఆరోపించారు.


