News April 5, 2024
ఐపీఎల్ మ్యాచ్కు సీఎం రేవంత్ రెడ్డి?

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ్టి ఐపీఎల్ మ్యాచ్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఉప్పల్ వేదికగా రాత్రి SRH, CSK జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ను సీఎం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించనున్నట్లు సమాచారం. సీఎం హోదాలో రేవంత్ మొదటిసారి ఉప్పల్ స్టేడియానికి వెళుతున్నారన్న వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా 9 ఏళ్ల క్రితం సీఎం హోదాలో ఇండియా, శ్రీలంక మ్యాచ్కు కేసీఆర్ వెళ్లిన విషయం తెలిసిందే.
Similar News
News November 11, 2025
ఏపీ అప్డేట్స్

☛ రబీలో ప్రధానమంత్రి పంట బీమా పథకం(PMFBY) అమలుకు రూ.44.06 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం
☛ MBBS రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదల.. రీకౌంటింగ్కు ఈ నెల 17 వరకు అవకాశం
☛ కల్తీ నెయ్యి కేసులో YCP నేత వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్న కస్టడీ పిటిషన్పై ఇవాళ విచారణ
☛ పింగళి వెంకయ్య, బ్రౌన్ల జయంతులను రాష్ట్ర పండగలుగా నిర్వహించాలని సీఎం చంద్రబాబుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లేఖ
News November 11, 2025
డేవిడ్ సలయ్కి ‘బుకర్ ప్రైజ్’

కెనడియన్-హంగేరియన్ రచయిత డేవిడ్ సలయ్ను ఈ ఏడాది ‘బుకర్ ప్రైజ్’ వరించింది. సాధారణ మనిషి జీవితం ఆధారంగా ఆయన రాసిన ‘ఫ్లెష్’ నావెల్కిగానూ ఈ పురస్కారం దక్కింది. 51 ఏళ్ల డేవిడ్ ఫైనల్లో ఐదుగురు రచయితలను వెనక్కినెట్టారు. వీరిలో ఇండియన్ మహిళా రచయిత కిరణ్ దేశాయ్ కూడా ఉన్నారు. ఆమె రాసిన ‘లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ పుస్తకం బుకర్ దక్కించుకోలేకపోయింది.
News November 11, 2025
మనీ ప్లాంట్ త్వరగా పెరగాలంటే?

* మనీ ప్లాంట్ పెంచే నీళ్లలో కొద్దిగా శీతల పానీయాలు పోస్తే ప్లాంట్ త్వరగా పెరుగుతుంది.
* వంటింట్లో నాలుగు మూలలు బోరిక్ యాసిడ్ పౌడర్ చల్లితే దోమల బెడద తగ్గుతుంది.
* కళ్లజోడు అద్దాలకు టూత్ పేస్ట్ రాసి టిష్యూ పేపర్తో శుభ్రం చేస్తే జిడ్డు పోతుంది.
* అన్నం మెతుకులు విడివిడిగా రావాలంటే ఉడికేటప్పుడు టేబుల్ స్పూన్ కనోలా ఆయిల్ వేయాలి.
* చపాతీలను బియ్యప్పిండితో వత్తితే మృదువుగా వస్తాయి.


