News April 5, 2024
ఐపీఎల్ మ్యాచ్కు సీఎం రేవంత్ రెడ్డి?
TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ్టి ఐపీఎల్ మ్యాచ్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఉప్పల్ వేదికగా రాత్రి SRH, CSK జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ను సీఎం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యక్షంగా వీక్షించనున్నట్లు సమాచారం. సీఎం హోదాలో రేవంత్ మొదటిసారి ఉప్పల్ స్టేడియానికి వెళుతున్నారన్న వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా 9 ఏళ్ల క్రితం సీఎం హోదాలో ఇండియా, శ్రీలంక మ్యాచ్కు కేసీఆర్ వెళ్లిన విషయం తెలిసిందే.
Similar News
News January 26, 2025
మహ్మద్ షమీకి మళ్లీ మొండిచేయే..!
ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు దక్కలేదు. తొలి టీ20లో స్థానం దక్కకపోయినా రెండో మ్యాచులోనైనా ఆయనను ఆడిస్తారని అంతా భావించారు. కానీ మేనేజ్మెంట్ అతడిని పెవిలియన్కే పరిమితం చేసింది. దీంతో చాన్నాళ్లకు షమీ బౌలింగ్ చూద్దామనుకున్న అభిమానులకు మరోసారి అసంతృప్తే మిగిలింది. మూడో టీ20లోనైనా ఆయనకు ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News January 26, 2025
అది షో ఆఫ్ ఎలా అవుతుంది?: ఊర్వశీ రౌతేలా
సైఫ్ అలీ ఖాన్పై దాడి గురించి మాట్లాడే సమయంలో హీరోయిన్ ఊర్వశీ రౌతేలా తన ఆభరణాల గురించి మాట్లాడటం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఊర్వశీ స్పందించారు. ‘సైఫ్పై దాడి విషయాలు నాకు అంతగా తెలియవు. నాకు తెలిసినంత వరకు చెప్పా. అదే సమయంలో నాకు బహుమతిగా వచ్చిన కానుకల గురించి చెప్పా. ఇది ఏమాత్రం షో ఆఫ్ కాదు. అదే నిజమైతే నా చేతికి ఉన్న చిన్న వాచ్ను కూడా చూపించేదాన్ని’ అని చెప్పారు.
News January 26, 2025
టీ20ల్లో అరుదు
SA టీ20లో పార్ల్ రాయల్స్ సంచలనం నమోదు చేసింది. ప్రిటోరియా క్యాపిటల్స్తో జరిగిన మ్యాచులో కేవలం స్పిన్నర్లతోనే ఆ జట్టు బౌలింగ్ చేయించింది. ఈ లీగ్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన పార్ల్ రాయల్స్ 140 పరుగులు చేయగా, ప్రిటోరియా 129కే పరిమితమైంది. దీంతో PR 11 పరుగుల తేడాతో విజయం సాధించగా ప్లేఆఫ్కు దూసుకెళ్లింది.