News January 9, 2025
తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
తిరుపతి తొక్కిసలాట ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన అస్వస్థతకు గురైనవారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుపతి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సీఎం, టీటీడీ ఛైర్మన్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైనవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Similar News
News January 19, 2025
20న ట్రంప్ ప్రమాణం.. 21న అరెస్టులు!
డొనాల్డ్ ట్రంప్ ఈనెల 20న అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసదారులను మూకుమ్మడిగా అరెస్టు చేయిస్తారని వార్తలు వస్తున్నాయి. అలాంటి వారిపై ఆయన ఉక్కుపాదం మోపుతారని పలు కథనాలు వెల్లడిస్తున్నాయి. దీనిపై అమెరికా వలసల విభాగం మాజీ అధికారి ఒకరు స్పందిస్తూ ట్రంప్ ప్రమాణం చేశాక 21నుంచే ఈ అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలిపారు. అక్రమంగా చొరబడ్డ వలసదారులను వెనక్కి పంపే చర్యలను ముమ్మరం చేస్తారన్నారు.
News January 19, 2025
బుల్లిరాజు పాత్రకు మహేశ్బాబు ఫిదా!
ప.గో జిల్లా భీమవరానికి చెందిన బుల్లిరాజు క్యారెక్టర్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఈ పాత్రకు ముగ్ధులైనట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘బుల్లిరాజు’ పాత్రలో నటించిన రేవంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘సినిమా చూశాక మహేశ్ సార్ను టీమ్తో కలిశాను. చాలా బాగా చేశావు బుల్లిరాజు. నీ కోసమైనా మళ్లీ సినిమా చూస్తానన్నారు. నాతో పాటు డాన్స్ కూడా చేశారు’ అని చెప్పుకొచ్చారు.
News January 19, 2025
డిప్యూటీ CM పదవికి లోకేశ్ అన్ని విధాలా అర్హుడు: సోమిరెడ్డి
AP: మంత్రి లోకేశ్ను డిప్యూటీ CM చేయాలన్న పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ప్రతిపాదనను MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమర్థించారు. ‘ఆ పదవికి లోకేశ్ వందశాతం అర్హులే. రాజకీయంగా అనేక డక్కామొక్కిలు తిని, అవమానాలు ఎదుర్కొన్నాక పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు. డిప్యూటీ CM పదవికి అన్ని విధాలా అర్హుడైన ఆయన పేరును పరిశీలించాలని పార్టీని కోరుతున్నాను’ అని ట్వీట్ చేశారు.