News June 7, 2024
పాలన ఎలా చేయాలో సీఎం రేవంత్ నేర్చుకోవాలి: మోత్కుపల్లి

TG: రేవంత్ CM అవుతారని తొలుత చెప్పిన తననే ఆయన మొదటగా రోడ్డున పడేశారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. 6గంటలు సెక్రటేరియట్లో కూర్చున్నా అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. ‘6సార్లు గెలిచిన నాకు ఇంత అవమానం ఎక్కడా జరగలేదు. పాలన ఎలా చేయాలో రేవంత్ నేర్చుకోవాలి. APలో అహంకారంతో జగన్ ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. CBN ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు’ అని పేర్కొన్నారు.
Similar News
News February 15, 2025
బాంబూ సాల్ట్.. కిలో రూ.30,000

ఉప్పు బ్రాండ్లను బట్టి KG ₹30-₹200 వరకు ఉంటుంది. అయితే కొరియన్/బాంబూ సాల్ట్ ధర ₹20-30K. దీన్ని తొలుత కొరియాలో తయారుచేసేవారు. వెదురు బొంగులో సముద్రపు ఉప్పును నింపి 400డిగ్రీల వద్ద కాల్చుతారు. ఇలా 9సార్లు చేస్తే స్పటిక రూపంలోకి మారుతుంది. KG తయారీకి 20D పడుతుంది. ఇందులో 73మినరల్స్ ఉంటాయి. దీన్ని వాడితే ఆరోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో ఉత్తరాఖండ్ సర్కార్ దీన్ని తయారుచేస్తోంది.
News February 15, 2025
సిన్నర్పై డోపింగ్ ఆరోపణలు.. మూడు నెలలు నిషేధం

మెన్స్ టెన్నిస్ నం.1 ప్లేయర్ జన్నిక్ సిన్నర్కు భారీ షాక్ తగిలింది. డోపింగ్లో పట్టుబడ్డ అతడిపై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ 3 నెలల నిషేధం విధించింది. ఫిజియోథెరపీ సమయంలో ఉత్ప్రేరకం తన శరీరంలోకి వెళ్లిందని సిన్నర్ ఆంగీకరించారు. WADA కూడా సిన్నర్ ఉద్దేశపూర్వకంగా ఎలాంటి మోసం చేయలేదని పేర్కొంది. అయినా FEB 9- మే 4 వరకు నిషేధం అమల్లో ఉంటుందంది. కాగా ఇటీవల సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచారు.
News February 15, 2025
భారత్లో పర్యటించనున్న ఖతర్ దేశాధినేత

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఖతర్ దేశాధినేత షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ తనీ ఈ నెల 17-18 తేదీల్లో భారత్లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ పర్యటనలో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలతో ఆయన భేటీ కానున్నట్లు తెలిపింది.