News November 25, 2024
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలపై ఆయన అధిష్ఠానంతో చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పార్టీ పెద్దలను ఆహ్వానిస్తారని సమాచారం. దీంతోపాటు మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ పదవుల గురించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Similar News
News November 7, 2025
సరస్వతీ దేవి ఎలా జన్మించింది?

పూర్వం సృష్టి శూన్యంగా ఉండేది. దీంతో బ్రహ్మ దేవుడు లోకాన్ని సృష్టించాలనుకున్నాడు. ఆ కార్యాన్ని ప్రారంభించడానికి అతనికి జ్ఞానం, వాక్కు అవసరమయ్యాయి. అప్పుడు బ్రహ్మ తన మనస్సు నుంచి తేజోమయి సరస్వతీ దేవిని సృష్టించాడు. ఆమె వీణ, పుస్తకం, జపమాల ధరించి, ఆవిర్భవించింది. బ్రహ్మకు వాక్కు, జ్ఞానం అందించింది. ఆమె అనుగ్రహంతోనే బ్రహ్మ వేదాలను, సమస్త విశ్వాన్ని సృష్టించగలిగాడు. అందుకే బ్రహ్మ మానస పుత్రిక అంటారు.
News November 7, 2025
భారీ జీతంతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంలో ఉద్యోగాలు

<
News November 7, 2025
ఆత్మవిశ్వాసాన్ని నింపే ‘వందేమాతరం’: మోదీ

వందేమాతరం గీతాలాపన దేశమాత ఆరాధనతో సమానమని ప్రధాని మోదీ చెప్పారు. ఢిల్లీలో జరిగిన 150వ స్మారకోత్సవంలో ఆయన ప్రసంగించారు. ‘ఈ గీతంలోని శబ్దం ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ప్రేరణను నింపుతుంది. భవిష్యత్తుకు భరోసాను కల్పిస్తుంది. ఈ గీతం ఒక సంకల్పం, ఒక మంత్రం, ఒక స్వప్నం. ఒకే లయ, స్వరం, భావంతో గీతాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుంది. సామూహిక గీతాలాపన అద్భుత అనుభవం’ అని పేర్కొన్నారు.


