News January 31, 2025
నేడు ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ శంకుస్థాపన

TG: హైదరాబాద్లో నిర్మిస్తోన్న కొత్త ఉస్మానియా ఆస్పత్రి భవనానికి CM రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11.55 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి CMతోపాటు Dy.CM భట్టి, మంత్రులు పాల్గొంటారు. గోషామహల్ స్టేడియంలో 26.3 ఎకరాల్లో ఈ భవనం నిర్మిస్తున్నారు. ఇందులో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, వార్డులు, మల్టీలెవెల్ పార్కింగ్, గార్డెన్లు, లేటెస్ట్ టెక్నాలజీ మార్చురీ, వెయిటింగ్ హాల్ వంటివి ఏర్పాటు చేయనున్నారు.
Similar News
News July 8, 2025
క్రికెట్ ఇండోర్ స్టేడియంలో ఎందుకు ఆడరు?

క్రికెట్ పిచ్, ఔట్ ఫీల్డ్, భారీ సంఖ్యలో వచ్చే ప్రేక్షకులకు ఇండోర్ స్టేడియం సరిపోదు. పిచ్, బౌలింగ్లో స్వింగ్, సీమ్ వాతావరణ మార్పులను బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని దేశాల్లో ఇండోర్ క్రికెట్ ఆడుతున్నారు. అయితే వాటి రూల్స్ భిన్నంగా ఉంటాయి. ICC మాత్రం అధికారికంగా ఇలాంటి మ్యాచ్లు నిర్వహించట్లేదు. పైకప్పును బంతి తాకితే దాన్ని ఎలా పరిగణించాలనే విషయంలో గందరగోళం కూడా దీనికి కారణం.
News July 8, 2025
చలాన్లు పెండింగ్లో ఉంటే లైసెన్స్ సస్పెండ్?

TG: ట్రాఫిక్ చలాన్లు చెల్లించనివారిపై చర్యలకు రవాణాశాఖ సిద్ధమైంది. మూడు నెలల పాటు పెండింగ్లో ఉంటే లైసెన్స్ సస్పెండ్ చేయాలన్న పోలీసుల ప్రతిపాదనలపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నిర్ణయంతో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణకు కళ్లెం వేయడంతో పాటు భారీగా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గత 7 నెలల్లో పదేపదే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన 18,973 మంది లైసెన్స్లను అధికారులు సస్పెండ్ చేశారు.
News July 8, 2025
చర్చకు రాకుంటే కేసీఆర్కు క్షమాపణ చెప్పు: KTR

TG: సీఎం రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదని, తాము సరిపోతామని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ‘రేవంత్.. నిజాయితీ, నిబద్ధత ఉంటే చర్చకు రా. లేకపోతే తప్పుడు కూతలు కూసినందుకు, మహా నాయకుడిపై అడ్డగోలుగా మాట్లాడినందుకు ముక్కు నేలకు రాసి KCRకు క్షమాపణలు చెప్పు. చర్చ కోసం రేవంత్ ఎక్కడికి రమ్మన్నా వస్తా. చర్చకు సత్తా లేకపోతే సవాళ్లు చేయొద్దు. సీఎంకు వాతలు పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని ఫైరయ్యారు.