News September 25, 2024
నామినేటెడ్ నేతలతో సీఎం సమీక్ష

AP: ఏ పదవిలో ఉన్నా ప్రజా సేవకులమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కొత్తగా ఎంపికైన కార్పొరేషన్ ఛైర్మన్లకు సీఎం చంద్రబాబు చెప్పారు. నామినేటెడ్ పదవులు పొందిన నేతలతో సమీక్ష నిర్వహించారు. పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని నేతలు గుర్తుంచుకోవాలన్నారు. కష్టపడిన వారికి అవకాశాలు ఇచ్చామని ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నేతలతో కూటమి ప్రభుత్వానికి పొలిటికల్ గెయిన్ ఉండాలని చెప్పారు.
Similar News
News December 24, 2025
ఇయర్ బడ్స్ను క్లీన్ చేస్తున్నారా? లేదంటే..

రోజూ వాడే ఇయర్ బడ్స్ చూడటానికి క్లీన్గానే అనిపిస్తాయి. కానీ వాటిలో కిచెన్ సింక్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందట. వాటిని సరిగా క్లీన్ చేయకపోతే ఇన్ఫెక్షన్లు, రాషెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇయర్ వాక్స్ పేరుకుపోయి వినికిడి సమస్యలు రావచ్చు. నెలకు ఒక్కసారైనా సాఫ్ట్ క్లాత్ లేదా టూత్ బ్రష్తో బడ్స్ను తుడవాలి. నీళ్లతో కడగొద్దు. అవి శుభ్రంగా ఉంటే హెల్త్ సేఫ్గా ఉండటంతో పాటు డివైజ్ ఎక్కువ కాలం పనిచేస్తుంది.
News December 24, 2025
పల్లవ రాణి కానుక ‘భోగ శ్రీనివాస మూర్తి’

క్రీ.శ.614లో శ్రీవారి పరమ భక్తురాలైన పల్లవ మహారాణి శ్యామమ్మ(కడవన్ పెరుందేవి) ఆయనకు ప్రతిరూపంగా ‘మనవాల పెరుమాళ్’ అనే వెండి భోగ శ్రీనివాస మూర్తి విగ్రహాన్ని సమర్పించారు. ఏటా పెరటాసి(కన్యామాసం) బ్రహ్మోత్సవాలకు ముందు ఈ వెండి విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించే సంప్రదాయాన్ని ఆమె ప్రారంభించారు. గర్భాలయంలోని మూలవిరాట్టు తరపున నిత్య కైంకర్యాలన్నీ నేటికీ ఈ భోగ శ్రీనివాస మూర్తికే నిర్వహిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News December 24, 2025
2,322 ఉద్యోగాలు.. ప్రొవిజనల్ లిస్ట్ విడుదల

TG: 2,322 నర్సింగ్ ఆఫీసర్(స్టాఫ్ నర్స్) పోస్టులకు సంబంధించి ఫస్ట్ ప్రొవిజనల్ లిస్టును <


