News April 24, 2024

సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం సెల్ఫీ

image

AP: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ సెల్ఫీ దిగారు. సోషల్ మీడియా వింగ్‌తో విశాఖలో ముఖాముఖి సమావేశం ముగిసిన అనంతరం సెల్ఫీదిగి కార్యకర్తల్లో జోష్ నింపారు. ‘మా సోషల్ మీడియా సూపర్‌స్టార్స్‌తో నేను’ అంటూ ఆ ఫొటోను సీఎం జగన్ ట్వీట్ చేశారు.

Similar News

News October 28, 2025

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

APPSC విడుదల చేసిన అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిషరీష్(3), రాయల్టీ ఇన్‌స్పెక్టర్ (1), వార్డెన్(1), ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్(1) పోస్టులను అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత డిప్లొమా, BSc, B.Ed, MA, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు అప్లై చేసుకోవచ్చు. వెల్ఫేర్ ఆర్గనైజర్(10), జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్(7), Jr అకౌంట్(7), Sr అకౌంట్స్(4) పోస్టులకు అప్లైకి రేపు ఆఖరు తేదీ.

News October 28, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

బంగారం ధరలు ఇవాళ కూడా తగ్గి కొనుగోలుదారులకు కాస్త ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 తగ్గి రూ.1,22,460కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల పసిడిపై రూ.750 పతనమై రూ.1,12,250గా ఉంది. అటు వెండిపై రూ.5,000 తగ్గింది. కేజీ సిల్వర్ ధర రూ.1,65,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 28, 2025

తుఫాను ఎఫెక్ట్.. ఎక్కడ ఏం జరుగుతోంది!

image

✎ తుఫాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
✎ VJA కొండపై నివసించే ప్రజలను అలర్ట్ చేసిన అధికారులు
✎ VZM జిల్లాలో 69 ముంపు ప్రాంతాల గుర్తింపు, 71 పునరావాస కేంద్రాలు ఏర్పాటు
✎ నిలకడగానే ప్రవహిస్తున్న వంశధార, నాగావళి నదులు
✎ పెన్నా, సంగం బ్యారేజీలకు భారీగా వరద నీరు
✎ ధ్వంసమైన ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్.. అలలకు రోడ్డుపైకి చేరుతున్న రాళ్లు