News July 30, 2024
ఇళ్ల నిర్మాణంపై సీఎం కీలక నిర్ణయం

AP: మధ్య, దిగువ మధ్య తరగతి వారికి ఇళ్ల కోసం గృహనిర్మాణ శాఖ ద్వారా ప్రత్యేకంగా ఒక పథకాన్ని అమలు చేయాలని CM చంద్రబాబు నిర్ణయించారు. అర్హులను గుర్తించి, కేంద్రం అమలు చేస్తున్న పథకాలతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణం చేపట్టాలని మంత్రులకు సూచించారు. అటు YCP హయాంలో ఇళ్లు మంజూరై కోర్టు వివాదాల కారణంగా నిర్మించుకోని వారికి కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పట్టణ)-2.0 కింద అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Similar News
News October 29, 2025
APPLY NOW: ICMRలో ఉద్యోగాలు

ICMR-న్యూఢిల్లీ 8 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. MBBS/MD/MS/PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1500. SC/ST/PWBD/EWS/మహిళలకు ఫీజు లేదు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.icmr.gov.in/
News October 29, 2025
గొర్రె, మేక పిల్లల పెంపకం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గొర్రె, మేక పిల్లలు పుట్టాక వారం వరకు రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లి నుంచి సరిపడా పాలు అందుతున్నాయా? లేదా? గమనించాలి. ఇది వాటి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెటర్నరీ డాక్టరు సూచన మేరకు దాణా అందించాలి. రెండు నుంచి ఐదు నెలల వరకు జొన్నలను దాణాగా ఇవ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మొక్కజొన్నలను పెట్టాలి. విటమిన్స్, కాల్షియం దాణాలో తగినంత ఉండేలా చూడాలి. పిల్లలకు 3 నెలల వయసులో డీవార్మింగ్ ప్రారంభించాలి.
News October 29, 2025
పెరిగిన బంగారం, వెండి ధరలు!

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఇవాళ కాస్త పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రా.ల బంగారం ధర రూ.760 పెరిగి రూ.1,21,580కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా.ల పసిడి ధర రూ.700 ఎగబాకి రూ.1,11,450గా ఉంది. అటు కేజీ వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,66,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


