News June 20, 2024
కూటమి విజయం అందరిదీ: పురందీశ్వరి

AP: రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం అందరి విజయమని రాష్ట్ర బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందీశ్వరి అన్నారు. ‘ఒకప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రతిపక్షం లేని రాష్ట్రంగా చెప్పుకుంటున్నాం. మూడు పార్టీల జెండాలు, ఎజెండాలు వేరైనా కలిసికట్టుగా పనిచేశాం. వైసీపీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పును ఇచ్చారు. కూటమిని ఆదరించారు’ అని ఆమె పేర్కొన్నారు.
Similar News
News December 5, 2025
మసీదు నిర్మాణ విషయంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

బాబ్రీ మసీదును పోలిన మసీదు నిర్మాణ విషయంలో జోక్యం చేసుకోలేమని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. TMC నుంచి సస్పెండైన MLA హుమాయున్ ప.బెంగాల్ ముర్షిదాబాద్(D) బెల్దంగాలో మసీదు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చిన DEC 6నే శంకుస్థాపనకు ముహూర్తం పెట్టుకున్నారని, స్టే ఇవ్వాలని పిల్ దాఖలైంది. దీనిపై విచారించిన తాత్కాలిక చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తిరస్కరించింది.
News December 5, 2025
TG టెట్ పరీక్షలు వాయిదా పడతాయా?

TG: ఇన్సర్వీస్ టీచర్లూ టెట్ పాస్ కావాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పు ఉపాధ్యాయుల్లో గుబులు పుట్టిస్తోంది. జనవరి 3 నుంచి 31 వరకు <<18427476>>టెట్<<>> జరగనుండగా ప్రిపరేషన్కు సమయంలేక ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల విధులు, సిలబస్ను పూర్తి చేయడం, వీక్లీ టెస్టుల నిర్వహణలో వారు బిజీగా ఉన్నారు. ఎన్నికలు ముగిశాక పరీక్షలకు 15 రోజులే గడువు ఉంటుంది. దీంతో టెట్ను వాయిదా వేయాలని ఆయా సంఘాలు కోరుతున్నాయి.
News December 5, 2025
ESIC ఫరీదాబాద్లో ఉద్యోగాలు

ఫరీదాబాద్లోని <


