News November 16, 2024

ఢిల్లీలో రూ.900 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత

image

ఢిల్లీలో మ‌రో భారీ డ్ర‌గ్స్ రాకెట్ వెలుగుచూసింది. వెస్ట్ ఢిల్లీలోని జ‌న‌క్‌పురీ, నంగ్లోయ్‌లో రూ.900 కోట్ల విలువైన 80 KGల కొకైన్‌ను నార్కోటిక్స్ అధికారులు ప‌ట్టుకున్నారు. ఆస్ట్రేలియాకు త‌ర‌లించ‌డానికి సిద్ధంగా ఉన్న ఈ క‌న్‌సైన్‌మెంట్‌ను సీజ్ చేశారు. ఈ విష‌యాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధ్రువీక‌రిస్తూ డ్ర‌గ్స్ రాకెట్‌పై నిర్దాక్షిణ్యంగా వేట సాగిస్తామ‌ని పేర్కొన్నారు. అధికారులను అభినందించారు.

Similar News

News March 14, 2026

US అప్పుడు ఇండియాను బెదిరించి ఇప్పుడు వేడుకుంటోంది: ఇరాన్

image

రష్యా నుంచి చమురు కొనవద్దని ఇండియాను అమెరికా కొన్ని నెలలపాటు బెదిరించిందని ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అరఘ్చి ట్వీట్ చేశారు. ఇరాన్‌తో 2 వారాల యుద్ధం తర్వాత ఆ పరిస్థితి మారిందన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని INDతో సహా మిగతా దేశాలను US వేడుకుంటోందని విమర్శించారు. ఇరాన్‌పై వార్‌కు మద్దతిస్తే రష్యాకు వ్యతిరేకంగా US సపోర్ట్ తమకు లభిస్తుందనుకున్న యూరప్‌కు ఎదురుదెబ్బ తగిలిందన్నారు.

News March 14, 2026

డైరెక్టర్‌గా శేఖర్ మాస్టర్.. హీరోగా ప్రభుదేవా కుమారుడు?

image

డాన్స్ కొరియోగ్రాఫర్లు డైరెక్టర్లుగా మారడం కొత్తేం కాదు. ఇప్పుడు ఈ లిస్టులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చేరబోతున్నట్లు సమాచారం. ఆయన తెరకెక్కించే సినిమాతో ప్రభుదేవా కుమారుడు రిషిల్ రాఘవేంద్ర దేవా హీరోగా ఇంట్రడ్యూస్ కాబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. మే నుంచి షూటింగ్ ఉంటుందని, త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలిపాయి. మ్యూజిక్, డాన్స్‌కి ప్రాధాన్యమున్న స్టోరీతో ఈ మూవీ రానుందట.

News March 14, 2026

ఇరాన్‌పై దాడులు.. 2 వారాల్లో 2,000 మంది మృతి!

image

ఇరాన్‌పై US&ఇజ్రాయెల్ గత 2 వారాలుగా జరిపిన దాడుల్లో ఇప్పటివరకూ 2వేల మందికి పైగా చనిపోయారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. మరోవైపు ఈ యుద్ధంలో మరణించిన అమెరికన్ సైనికుల సంఖ్య 11కి చేరింది. ఈ లిస్టులో వెస్టర్న్ ఇరాక్‌లో క్రాష్ అయిన రీఫ్యుయలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిబ్బంది ఆరుగురు కూడా ఉన్నారు. ఇక తమ దేశంపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 100+ మంది పిల్లలు మరణించినట్లు లెబనాన్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది.