News August 14, 2024

HYDలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్.. నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం

image

TG: హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కంపెనీ 10 లక్షల చ.అ విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. దీనికి ఆ సంస్థ సీఈవో రవికుమార్‌తో కలిసి సీఎం రేవంత్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్యాంపస్ ద్వారా 15వేల మందికి ఉద్యోగాలు వస్తాయని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. పెట్టుబడుల కోసం అమెరికా, సౌత్ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ బృందం నేడు రాష్ట్రానికి రానుంది.

Similar News

News January 30, 2026

DyCMగా అజిత్ పవార్ భార్య.. రేపే ప్రమాణం!

image

మహారాష్ట్ర DyCMగా అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రేపు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఆమె పేరును ఖరారు చేసేందుకు రేపు మధ్యాహ్నం 2 గంటలకు ముంబైలో లెజిస్లేటివ్ పార్టీ సమావేశం నిర్వహించనున్నారని NCP వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే MH తొలి మహిళా DyCMగా సునేత్ర రికార్డు సృష్టించనున్నారు. ప్రస్తుతం ఆమె MPగా ఉన్నారు. <<18980385>>విమాన ప్రమాదంలో<<>> అజిత్ మరణించడం తెలిసిందే.

News January 30, 2026

ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100% గ్రాస్ శాలరీ

image

AP: వైద్యారోగ్య శాఖలో నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగుల్లో రెగ్యులరైన 1560 మందికి 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలని ప్రభుత్వం GO ఇచ్చింది. టైమ్ స్కేల్ అమలుతో వీరి జీతాలు 2023 SEP-2024 MAR మధ్య తగ్గాయి. అయితే కోర్టు తీర్పు ఇతర కారణాలతో వారికి పూర్తి వేతనం ఇవ్వడంతోపాటు అరియర్స్ చెల్లించాలని తాజాగా నిర్ణయించింది. జీతాలకు ఏటా ₹21,51,36,724 అదనపు భారం GOVTపై పడుతుంది. అరియర్ల కింద ₹16,45,41,361 చెల్లించనుంది.

News January 30, 2026

‘హౌసింగ్ కార్పొరేషన్’ పునరుద్ధరణ… డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ బదిలీ

image

TG: గత BRS ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్‌ను ఎత్తేసి సిబ్బందిని R&Bలో విలీనం చేసింది. కీలకమైన డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని ఆ శాఖకు అప్పగించింది. అప్పట్నుంచీ నిర్మాణాలను ఆ శాఖే చేపడుతోంది. అయితే స్కీమ్‌ను స్పీడప్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్‌ను తిరిగి కొనసాగించేలా చర్యలు చేపట్టింది. ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. డబుల్ బెడ్ రూమ్ స్కీమ్‌ను R&B నుంచి ఆ సంస్థకు అప్పగించింది.