News March 5, 2025
BSE, NSE మధ్య కోల్డ్వార్?

దేశంలోని 2 అతిపెద్ద స్టాక్మార్కెట్ల మధ్య కోల్డ్వార్ మొదలైందని ట్రేడర్లు ఆరోపిస్తున్నారు. తాజాగా నిఫ్టీ వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ డెరివేటివ్స్ ఎక్స్పైరీని NSE THU నుంచి MONకి మార్చింది. వీకెండ్లో అంతర్జాతీయ పరిణామాలు వేగంగా మారుతుండటంతో ఇలా చేశామంది. డెరివేటివ్స్ వాల్యూమ్ పెంచుకొనేందుకే ఇలా చేసిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. NSE నిర్ణయంతో BSE షేర్లు 8.3% నష్టంతో రూ.4078 వద్ద చలిస్తున్నాయి.
Similar News
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <
News July 11, 2025
జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News July 11, 2025
ఫీజులు పెంచాలన్న అభ్యర్థనను తిరస్కరించిన HC

TG: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలన్న పలు కాలేజీల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా ఫీజులు నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీని ఆదేశించింది. కమిటీ నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని కాలేజీలకు న్యాయస్థానం స్పష్టం చేసింది.