News March 5, 2025

BSE, NSE మధ్య కోల్డ్‌వార్?

image

దేశంలోని 2 అతిపెద్ద స్టాక్‌మార్కెట్ల మధ్య కోల్డ్‌వార్ మొదలైందని ట్రేడర్లు ఆరోపిస్తున్నారు. తాజాగా నిఫ్టీ వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ డెరివేటివ్స్ ఎక్స్‌పైరీని NSE THU నుంచి MONకి మార్చింది. వీకెండ్లో అంతర్జాతీయ పరిణామాలు వేగంగా మారుతుండటంతో ఇలా చేశామంది. డెరివేటివ్స్ వాల్యూమ్ పెంచుకొనేందుకే ఇలా చేసిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. NSE నిర్ణయంతో BSE షేర్లు 8.3% నష్టంతో రూ.4078 వద్ద చలిస్తున్నాయి.

Similar News

News March 24, 2025

31 కంపార్టు‌మెంట్లలో శ్రీవారి భక్తులు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని
31 కంపార్టుమెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 84,198 మంది దర్శించుకోగా, 25,665 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

News March 24, 2025

APR 7 నుంచి అడ్మిషన్లు.. వేసవి సెలవుల్లో మార్పు!

image

AP: ఇంటర్ విద్యలో కీలక మార్పుల అమలుకు ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఏటా జూన్ 1న ప్రారంభమయ్యే ఇంటర్ విద్యా సంవత్సరం ఈ ఏడాది APR 1న మొదలుకానుంది. 7న అడ్మిషన్లు స్టార్ట్ చేసి 24వరకు క్లాసులు నిర్వహిస్తారు. ఆపై మే నెలాఖరు వరకు సెలవులుండగా, జూన్ 2న తిరిగి కాలేజీలు ప్రారంభం అవుతాయి. మొత్తం 235రోజులు తరగతులు జరగనున్నాయి. వేసవి సెలవులు కాకుండా 79 హాలిడేస్ ఉంటాయి.

News March 24, 2025

ప్రైమరీ స్కూళ్లకు కంప్యూటర్లు

image

TG: 50 మందికి పైగా విద్యార్థులున్న ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్లకు 5 చొప్పున కంప్యూటర్లు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1 నాటికి వీటిని స్కూళ్లలో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈనెల 15 నుంచి ప్రయోగాత్మకంగా 513 స్కూళ్లలో AI టూల్స్‌ను వినియోగిస్తూ ఇంగ్లిష్, మ్యాథ్స్ పాఠాలను బోధిస్తున్నారు. 25-26 విద్యా సంవత్సరంలో మరిన్ని స్కూళ్లలో దీనిని అమలు చేయనున్నారు.

error: Content is protected !!