News August 19, 2024
బెంగాల్లో ప్రజాస్వామ్యం పతనం: గవర్నర్

బెంగాల్లో ప్రజాస్వామ్యం పతనమవుతోందని గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ అన్నారు. మహిళలకు అండగా ఉంటానని రక్షాబంధన్ సందర్భంగా రాజ్భవన్లో తనను కలిసిన మహిళా వైద్యులు, నేతలకు అభయమిచ్చారు. ‘మన కూతుళ్లు, అక్కచెల్లెళ్లను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయాలి. వారు సంతోషంగా, భద్రంగా ఉండే సమాజాన్ని నిర్మించాలి. ఇది మన కనీస ధర్మం. మనది సుదూర లక్ష్యమని తెలుసు. మీ వెంట నేనున్నా. మనం దాన్ని కచ్చితంగా చేరగలం’ అని ఆయన అన్నారు.
Similar News
News September 19, 2025
పాకిస్థాన్ ఓవరాక్షన్పై ICC సీరియస్!

ఆసియా కప్: యూఏఈతో మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ ఓవరాక్షన్ వల్ల మ్యాచ్ గంట ఆలస్యమైన విషయం తెలిసిందే. ఆ రోజు రూల్స్ అతిక్రమించారని PCBకి ICC లేఖ, ఈమెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. స్టేడియంలో వీడియో రికార్డ్ చేసి వారి SM ఖాతాల్లో పోస్ట్ చేయడంపై కూడా సీరియస్గా ఉంది. ఈ నేపథ్యంలోనే PCBపై చర్యలు తీసుకునేందుకు ICC సిద్ధమవుతోందని సమాచారం. ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
News September 19, 2025
సుస్థిర నగరంగా అమరావతి నిర్మాణం: CRDA

AP: ప్రభుత్వం నిర్మించబోయే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(AGC) మినియేచర్ మోడల్స్ను ప్రజల సందర్శనార్ధం CRDA ప్రదర్శించనుంది. ఈ నమూనాలను విజయవాడలోని ఏ కన్వెన్షన్లో CRDA కమిషనర్ కన్నబాబు ప్రాపర్టీ ఫెస్టివల్ నిర్వాహకుల సమక్షంలో ఆవిష్కరించారు. ఇవాళ్టి నుంచి 21వరకు 11వ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్లో ఈ మోడల్స్ ప్రదర్శన కోసం ఉంచనున్నారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, HOD 4 టవర్స్ నిర్మించనున్నామన్నారు.
News September 19, 2025
కరేడులో భూములు లాక్కోవడం లేదు: అనగాని

AP: నెల్లూరు(D) ఉలవపాడు(M) కరేడులో ఇండోసోల్ కంపెనీ కోసం రైతుల నుంచి భూములు లాక్కోవడం లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. నష్టపరిహారం ఎకరాకు రూ.20 లక్షలుగా నిర్ణయించడంతో రైతులే సమ్మతించి భూములు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారన్నారు. ఇప్పటికే 500 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ఒప్పుకోగా, 300 ఎకరాలకు నష్టపరిహారం కూడా చెల్లించామన్నారు. మండలిలో YCP MLC మాధవరావు అడిగిన ప్రశ్నకు పైవిధంగా సమాధానమిచ్చారు.