News September 27, 2024
కుప్పకూలిన బంగారు గని.. 15 మంది మృతి
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ సుమత్రలో కొండచరియలు విరిగిపడటంతో అక్రమ బంగారు గని కుప్పకూలి 15 మంది మరణించారు. భారీ వర్షాల కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో ఏడుగురు గల్లంతైనట్లు పేర్కొన్నారు. రిమోట్ ఏరియా కావడంతో రవాణా సదుపాయం సరిగా లేదని వెల్లడించారు. దీంతో సహాయక చర్యలకు ఆలస్యమవుతున్నట్లు చెప్పారు.
Similar News
News September 27, 2024
వెండి ధర కేజీ రూ.1,02,000
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ.430 పెరిగి రూ.77,450కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.400 పెరిగి రూ.71,000 పలుకుతోంది. ఇక వెండి రేటు కేజీ రూ.1,000 పెరిగి రూ.1,02,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News September 27, 2024
INDvsBAN: స్టేడియంలో కొండముచ్చులతో భద్రత!
ఇండియా- బంగ్లాదేశ్ రెండో టెస్టును చూసేందుకు వచ్చిన ప్రేక్షకులను కోతుల నుంచి రక్షించేందుకు గ్రీన్ పార్క్ స్టేడియం నిర్వాహకులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. కోతులు ప్రేక్షకుల మొబైల్స్, ఆహారం, ఇతర వస్తువులను దొంగిలిస్తుండేవి. ఈ క్రమంలో కోతులను తరిమేలా కొండముచ్చులను బరిలోకి దింపేందుకు ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం స్టేడియంలో కొండముచ్చులు భద్రతనిస్తున్నాయి.
News September 27, 2024
హిందూ మతాన్ని నమ్మడం, వాడుకోవడం వేర్వేరు: పూనమ్ కౌర్
AP: తిరుమల లడ్డూ, హిందూ మతంపై చర్చల వేళ హీరోయిన్ పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘హిందూయిజాన్ని స్వలాభం కోసం వాడుకోవడం, హిందూ మతాన్ని నమ్మే వ్యక్తిగా ఉండటం వేరు’ అని రాసుకొచ్చారు. దీంతో ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.