News June 29, 2024
రాజ్కోట్ ఎయిర్పోర్టులో ధ్వంసమైన పైకప్పు
ఢిల్లీ విమానాశ్రయంలో పైకప్పు కూలి ఓ క్యాబ్ డ్రైవర్ మృతిచెందిన దుర్ఘటన మరువక ముందే అదే తరహా ఘటన మరోటి వెలుగుచూసింది. గుజరాత్లోని రాజ్కోట్ విమానాశ్రయంలో భారీ వర్షాల కారణంగా ఎయిర్పోర్టు వెలుపల ఉన్న పైకప్పు ధ్వంసమైంది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా అంతకుముందు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లోనూ విమానాశ్రయం పైకప్పు భారీ వర్షాలకు ధ్వంసమైంది.
Similar News
News October 11, 2024
ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్ల మధ్య హెచ్చరికలు, విజ్ఞప్తులు
ఇజ్రాయెల్ దురాక్రమణలకు దిగితే కఠిన చర్యలకు సిద్ధమని ఇరాన్ హెచ్చరించింది. ఇక లెబనాన్ నుంచి ప్రయోగించిన 25 రాకెట్లలో కొన్నింటిని ఇంటర్సెప్ట్ చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు పౌరులు, జనావాసాలపై ఇజ్రాయెల్ దాడులు నిలిపివేయాలని లెబనాన్ కోరింది. గురువారం జరిగిన దాడుల్లో 139 పౌరులు మృతి చెందినట్టు తెలిపింది. UN తీర్మానం మేరకు కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని కోరింది.
News October 11, 2024
ఆ రూ.లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు: కిషన్ రెడ్డి
TG: పేదల ఇళ్ల కూల్చివేతల విషయంలో హైడ్రా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. ‘ఇళ్లను కూల్చివేస్తే బ్యాంకు రుణాలు ఎవరు చెల్లిస్తారు? పేదలతో చర్చించి, వారికి ప్రత్యామ్నాయం చూపించాకే ముందుకు వెళ్లాలి. డ్రైనేజీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం లేకుండా మూసీ సుందరీకరణ ఎలా సాధ్యం? మూసీ సుందరీకరణకు రూ.లక్షన్నర కోట్లను ప్రభుత్వం ఎక్కడి నుంచి సమీకరిస్తుంది’ అని ప్రశ్నించారు.
News October 11, 2024
APPLY NOW.. 2050 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు
TG: 2050 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు అక్టోబర్ 14వ తేదీతో ముగియనుంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 16, 17 తేదీల్లో సవరణలు చేసుకోవచ్చు. నవంబర్ 23వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో అత్యధికంగా 1576 ఖాళీలున్నాయి. ఎంపికైన వారికి పేస్కేల్ రూ.36,750-రూ.1,06,990 ప్రకారం జీతాలు చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు ఇక్కడ <