News August 14, 2024

మ‌హువా మొయిత్రాపై విమ‌ర్శ‌లు

image

కోల్‌క‌తాలో ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచార ఘటనపై ఎక్స్‌లో ప్ర‌శ్నించిన జ‌ర్న‌లిస్టును TMC ఎంపీ మ‌హువా మొయిత్రా బ్లాక్ చేయ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అనేక అంశాల్లో కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డే మహువా బెంగాల్‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌పై ప్ర‌శ్నించినందుకు త‌న‌ను బ్లాక్ చేయ‌డంపై జ‌ర్నలిస్ట్ అజిత్ అంజుమ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక్క ప్ర‌శ్న‌ను కూడా హ్యాండిల్ చేయ‌లేరా? అంటూ నిల‌దీశారు.

Similar News

News November 10, 2025

రూ.5,200 కోట్లతో విశాఖలో లారస్ ల్యాబ్స్

image

AP: ప్రముఖ డ్రగ్ కంపెనీ లారస్ ల్యాబ్స్ విశాఖలో దాదాపు రూ.5,200 కోట్లతో అత్యాధునిక మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం 532 ఎకరాలను కేటాయించిందని సంస్థ ఫౌండర్ చావా సత్యనారాయణ తెలిపారు. ఔషధ కంపెనీల్లో కీలకమైన ఫర్మంటేషన్ ప్లాంట్‌నూ ఇక్కడే ఏర్పాటుచేస్తామన్నారు. ప్రస్తుతం ఏటా రూ.వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని పెట్టుబడులు పెడతామని పేర్కొన్నారు.

News November 10, 2025

సాహితీ శిఖరం నేలకొరిగింది: సీఎం రేవంత్

image

TG: అందెశ్రీ మరణంపై CM రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాహితీ శిఖరం నేలకొరిగిందన్నారు. రాష్ట్ర సాధనలో అందెశ్రీ కోట్లాది ప్రజల గొంతుకై నిలిచారని కొనియాడారు. ఆయన రాసిన జయజయహే తెలంగాణను ప్రజా ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించిందని గుర్తు చేసుకున్నారు. TPCC చీఫ్ మహేశ్ కుమార్, రాష్ట్ర మంత్రులు కూడా అందెశ్రీ మరణానికి సంతాపం తెలిపారు.

News November 10, 2025

ఐఆర్ 30 శాతం ప్రకటించాలి: PRTU

image

AP: హైస్కూల్ ప్లస్‌లలో లెక్చరర్లుగా అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని పీఆర్టీయూ డిమాండ్ చేసింది. పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటుచేయాలని, మధ్యంతర భృతి(IR) 30 శాతం ప్రకటించాలని కోరింది. అలాగే మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో హెడ్ మాస్టర్లకు ప్రత్యేక జాబ్ చార్ట్ ప్రకటించాలని APMPS HMల ఫోరం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది.