News January 9, 2025

ప్రియాంక, ఆతిశీపై కామెంట్స్.. రమేశ్ బిధూరీ ఎమ్మెల్యే సీటుకు ఎసరు!

image

కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ, ఢిల్లీ CM ఆతిశీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన BJP నేత రమేశ్ బిధూరీపై ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సౌత్ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న ఆయనను తప్పించి, మహిళా అభ్యర్థిని నిలపాలని చూస్తున్నట్లు సమాచారం. కాగా CM ఆతిశీ తన తండ్రినే మార్చేశారని, తాను MLAగా గెలిస్తే నియోజకవర్గ రోడ్లను ప్రియాంక బుగ్గల్లా మారుస్తానని రమేశ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Similar News

News February 2, 2026

పిండి దీపం వెలిగిస్తున్నారా?

image

పిండి దీపం వెలిగిస్తే పనుల్లో ఆటంకాలు తొలగి, సకల కార్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఈ దీపారాధనతో గ్రహ దోషాలు, ఆర్థికారోగ్య సమస్యలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శనివారం రోజు ఈ దీపం వెలిగించడం వల్ల శ్రీనివాసుని అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. నారాయణుడి మంత్రోచ్చారణలతో 7 వారాల పాటు ఇలా చేయాలని సూచిస్తున్నారు. పిండి దీపం ఎలా తయారుచేయాలి, ఎలా వెలిగించాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.

News February 2, 2026

పిగ్మెంటేషన్ రకాలు

image

పిగ్మెంటేషన్‌లో 2 రకాలున్నాయి. మొదటిది హైపర్-పిగ్మెంటేషన్. ఇందులో మెలనిన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం వలన చర్మంపై ముదురు రంగు మచ్చలు, మెలస్మా, నల్ల మచ్చలు ఏర్పడతాయి. 2వది హైపో-పిగ్మెంటేషన్. ఇందులో మెలనిన్ ఉత్పత్తి తక్కువగా ఉండటం వలన చర్మంపై లేత రంగు మచ్చలు లేదా బొల్లి – విటిలిగో ఏర్పడతాయి. వయస్సు, హార్మోన్ల మార్పులు, సూర్యరశ్మి, కొన్ని రకాల మందులు, జన్యుపరమైన అంశాలు ఈ సమస్యకు కారణం కావచ్చు.

News February 2, 2026

పిండి దీపాన్ని ఎలా వెలిగించాలంటే..?

image

ఓ అరిటాకు తీసుకొని దానిపై మీరు చేసిన పిండి ప్రమిదను ఉంచాలి. అందులో అఖండ వత్తిని వేసి, ఆవునేతితో నింపాలి. ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’ అని పలుకుతూ దీపం వెలిగించాలి. అనంతరం తర్వాత విష్ణు సహస్రనామం, అష్టోత్తరం చదువుకోవాలి. దీపం కొండెక్కిన తర్వాత, ఆ పిండిని చక్కెర పొంగలి లేదా గారెల్లా చేసి స్వామికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా ఏడు శనివారాలు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.