News January 9, 2025
ప్రియాంక, ఆతిశీపై కామెంట్స్.. రమేశ్ బిధూరీ ఎమ్మెల్యే సీటుకు ఎసరు!

కాంగ్రెస్ MP ప్రియాంకా గాంధీ, ఢిల్లీ CM ఆతిశీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన BJP నేత రమేశ్ బిధూరీపై ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సౌత్ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న ఆయనను తప్పించి, మహిళా అభ్యర్థిని నిలపాలని చూస్తున్నట్లు సమాచారం. కాగా CM ఆతిశీ తన తండ్రినే మార్చేశారని, తాను MLAగా గెలిస్తే నియోజకవర్గ రోడ్లను ప్రియాంక బుగ్గల్లా మారుస్తానని రమేశ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
Similar News
News April 12, 2026
ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

నాన్ ఇంటర్లాకింగ్ పనులు జరుగుతున్నందున నం.18519/20 విశాఖపట్నం- LTT ముంబై ఎక్స్ప్రెస్ రైళ్లను దారి మళ్లించామని రైల్వే అధికారులు తెలిపారు. మే 1 నుంచి 4 వరకు ఈ రైళ్లు విజయవాడ- ఖాజీపేట- పగిడిపల్లి మీదుగా కాక విజయవాడ- గుంటూరు- పగిడిపల్లి మీదుగా ప్రయాణిస్తాయని, మే 1 నుంచి 4 వరకు ఈ రైళ్లకు ఖాజీపేటలో స్టాప్ తొలగించామని అధికారులు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
News April 12, 2026
మార్నింగ్ నుంచి హుషారుగా ఉండాలంటే..

*నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీరం ఉత్తేజమవుతుంది. జీర్ణ సమస్యలు తొలగుతాయి.
*రోజూ 20-30 ని.ల పాటు యోగా, వాకింగ్ చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
*పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం తీసుకుంటే శక్తి లభిస్తుంది. నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి.
*ఎండలో కాసేపు గడపడం వల్ల విటమిన్ D అందుతుంది.
*పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టాలి.
News April 12, 2026
2 ఏళ్ల లోపు చిన్నారులకు దగ్గు మందు బ్యాన్!

2 ఏళ్ల లోపు పిల్లలకు దగ్గు సిరప్లను ప్రిస్క్రిప్షన్లో రాయకుండా నిషేధించాలని కేంద్రం భావిస్తోంది. ఐదేళ్ల పిల్లలకూ వాటి వాడకాన్ని తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ రిలీజ్ చేసిన నేషనల్ ఫార్ములరీ ఆఫ్ ఇండియా-2026 ముసాయిదాలో భాగంగా ఈ చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. గతేడాది దగ్గు మందు వల్ల పిల్లలు <<17944156>>చనిపోవడం<<>>, సిరప్లో హానికర రసాయనాలు ఉన్నట్లు తేలడం తెలిసిందే.


