News January 10, 2025

సావర్కర్‌పై కామెంట్స్.. రాహుల్ గాంధీకి బెయిల్

image

పరువు నష్టం కేసులో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పుణే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది. 2023 మార్చిలో లండన్‌ వేదికగా VD సావర్కర్‌పై రాహుల్ అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ ఆయన మనవడు సత్యకి సావర్కర్ పరువునష్టం దావా వేశారు. ఈ కేసు విచారణకు రాహుల్ గాంధీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

Similar News

News January 26, 2025

బంగ్లా ఎన్నికల నుంచి హసీనా పార్టీపై నిషేధం

image

మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని తమ దేశ ఎన్నికల నుంచి నిషేధిస్తున్నట్లు తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహ్‌ఫూజ్ ఆలం తెలిపారు. ‘బంగ్లా అనుకూల పార్టీలు మాత్రమే ఇకపై ఎన్నికల్లో పాల్గొంటాయి. బీఎన్‌పీ, జమాత్-ఈ-ఇస్లామ్ వంటి పార్టీలే బరిలో ఉంటాయి. ఇవే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. సంస్కరణలు పూర్తయ్యే వరకూ మాత్రం దేశంలో ఏ ఎన్నికా జరగదు’ అని స్పష్టం చేశారు.

News January 26, 2025

పద్మ అవార్డులు పొందిన తెలుగు నటులు వీరే

image

టాలీవుడ్ నటులకు చాలా తక్కువగా పద్మ అవార్డులు వచ్చాయి. ఇప్పటివరకు ఐదు మందినే పద్మ పురస్కారాలు వరించాయి. ఎన్టీఆర్ పద్మశ్రీ-1968, అక్కినేని నాగేశ్వరరావు పద్మశ్రీ-1968, పద్మ భూషణ్-1988, పద్మ విభూషణ్-2011, క్రిష్ణ పద్మభూషణ్-2009, చిరంజీవి పద్మభూషణ్-2006, పద్మ విభూషణ్-2024, నందమూరి బాలకృష్ణ-2025.

News January 26, 2025

కుంభమేళా.. నాగసాధువుల గురించి ఈ విషయాలు తెలుసా?

image

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వేలసంఖ్యలో నాగసాధువులు తరలివచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. నాగసాధువులు ఒంటి మీద నూలుపోగు లేకుండా హిమాలయాల్లో ధ్యానం చేస్తుంటారు. విపరీతమైన చలి, ఎండకు కూడా వీరు చలించరు. అన్ని రుతువులకు తట్టుకునేలా అగ్నిసాధన, నాడీ శోధన, మంత్రపఠనం చేసి శరీరం, మనసుపై నియంత్రణ పొందుతారు. రోజులో ఒక్కసారి మాత్రమే భోజనం తీసుకుంటారు. వీరు చనిపోయిన చోటే సమాధి చేస్తారు.