News December 21, 2024
అల్లు అర్జున్పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు
అల్లు అర్జున్తో పాటు ‘పుష్ప-2’ నిర్మాతలు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని BC పొలిటికల్ JAC ఛైర్మన్ యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. సినిమా ప్రచారం కోసం థియేటర్కు వెళ్లి ఓ మహిళ చావుకు కారణమయ్యారని ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
Similar News
News January 26, 2025
వన్డే క్రికెట్లో కోహ్లీ మకుటం లేని మహారాజు: కైఫ్
టెస్టుల్లో పేలవ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి పుంజుకుంటారని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు. ‘టెస్టుల సంగతి ఎలా ఉన్నా.. వన్డే ఫార్మాట్లో విరాట్ కోహ్లీ మకుటం లేని మహారాజు. ఆయనెప్పుడూ ఓటమిని అంగీకరించరు. ఇప్పటికే వన్డేల్లో 50 సెంచరీలు, 13వేల పరుగులు చేశారు. తెల్లబంతిపై ఆయన ఆట వేరే స్థాయిలో ఉంటుంది. ఆయన శకం ఇంకా ముగిసిపోలేదు’ అని పేర్కొన్నారు.
News January 26, 2025
నేటి ముఖ్యాంశాలు
* 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం
* డా.నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్, బాలకృష్ణకు పద్మభూషణ్
* హైదరాబాద్ తెలుగు వారందరిది: ఏపీ సీఎం చంద్రబాబు
* జగన్ వద్దన్నా రాజీనామా చేశా: VSR
* రేపు తెలంగాణలో 4 కొత్త పథకాలు ప్రారంభం
* ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వం: బండి
* ఇంగ్లండ్పై రెండో టీ20లో భారత్ విజయం
News January 26, 2025
పద్మ పురస్కారాలపై సీఎం రేవంత్ అసంతృప్తి
TG: పద్మ పురస్కారాల్లో రాష్ట్రానికి కేవలం రెండు మాత్రమే రావడంపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం వివక్ష చూపించిందని మండిపడ్డారు. గద్దర్, గోరటి వెంకన్న, అందెశ్రీ, చుక్కా రామయ్యవంటి పలువురు ప్రముఖుల పేర్లను తాము ప్రతిపాదించినా పరిగణించకపోవడం తెలంగాణ ప్రజలందర్నీ అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. 139 పద్మ అవార్డుల్లో రాష్ట్రానికి కనీసం 5 కూడా ఇవ్వకపోవడమేంటంటూ సీఎం ప్రశ్నించారు.