News October 26, 2024
ALTT ఓటీటీపై ఫిర్యాదులు

ALTT ఓటీటీపై చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులకు సమాచార మాజీ కమిషనర్ ఉదయ్ మహుర్కర్ ఆధ్వర్యంలోని సేవ్ కల్చర్-సేవ్ భారత్ ఫౌండేషన్ ఫిర్యాదు చేసింది. సదరు OTT అసభ్యకర కంటెంట్ను అందుబాటులోకి తెచ్చి పోక్సో, ఐటీ చట్టాల్ని ఉల్లంఘిస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. లైంగిక-అసభ్యకరమైన కంటెంట్ అందుబాటులో ఉండడమే దేశంలో అత్యాచారాలకు ప్రధాన కారణమని ఉదయ్ పేర్కొన్నారు.
Similar News
News January 13, 2026
మన ఊరు దగ్గరవుతున్న కొద్దీ ఆ ఫీలింగే వేరు!

సంక్రాంతికి పట్టణాలన్నీ ఖాళీ అవుతుండగా పల్లెలు సందడిగా మారాయి. ఇప్పటికే కొందరు సొంతూళ్లకు చేరుకోగా, మరికొందరు ప్రయాణాల్లో ఉన్నారు. అయితే మన ఊరు కొద్ది దూరంలో ఉందనగా కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేనిదని పలువురు SMలో పోస్టులు పెడుతున్నారు. పేరెంట్స్, ఫ్రెండ్స్, స్కూల్, చెరువు, పొలాలు తదితరాలు గుర్తుకొస్తాయి. పండగకి ఊరెళ్లేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో.. తిరిగొచ్చేటప్పుడు అంతే బాధగా అన్పిస్తుంది కదా?
News January 13, 2026
ఇరాన్ నిరసనలు.. ఇతడికే తొలి ‘ఉరి’..!

సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా ఇరాన్లో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఇప్పటికే 650మందిని పోలీసులు కిరాతకంగా కాల్చి చంపారు. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో వారిలో భయం పుట్టించేందుకు నియంతృత్వ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆందోళనలో పాల్గొన్న 26 ఏళ్ల ఇర్ఫాన్ సొల్తానీని రేపు ఉరి తీసేందుకు రంగం సిద్ధంచేసింది. దీంతో మానవహక్కుల ఉద్యమకారులు SMలో అతడికి మద్దతు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
News January 13, 2026
పాదాల అందం కోసం

మన శరీరంలోనే భాగమైన పాదాల సంరక్షణను అంతగా పట్టించుకోం. దీని వల్ల మడమలకు పగుళ్లు వచ్చి తీవ్రంగా బాధిస్తాయి కూడా. కొన్ని చిట్కాలు పాటించి ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. * పాదాల పగుళ్లు ఉన్నచోట కొద్దిగా తేనె రాసుకొని అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే ఫలితం ఉంటుంది. * ఓట్మీల్, పాల మిశ్రమం కూడా మంచి ఔషధంలా పనిచేస్తుంది. వారానికోసారి ఈ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుంటే పగుళ్లు మాయమవుతాయి.


