News October 26, 2024
ALTT ఓటీటీపై ఫిర్యాదులు

ALTT ఓటీటీపై చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులకు సమాచార మాజీ కమిషనర్ ఉదయ్ మహుర్కర్ ఆధ్వర్యంలోని సేవ్ కల్చర్-సేవ్ భారత్ ఫౌండేషన్ ఫిర్యాదు చేసింది. సదరు OTT అసభ్యకర కంటెంట్ను అందుబాటులోకి తెచ్చి పోక్సో, ఐటీ చట్టాల్ని ఉల్లంఘిస్తోందని ఫిర్యాదులో పేర్కొంది. లైంగిక-అసభ్యకరమైన కంటెంట్ అందుబాటులో ఉండడమే దేశంలో అత్యాచారాలకు ప్రధాన కారణమని ఉదయ్ పేర్కొన్నారు.
Similar News
News October 15, 2025
ప్రభుత్వానికి ఆస్తి రాసిచ్చి.. కొడుకుకు తండ్రి గుణపాఠం!

TG: తన బాగోగులు చూసుకోని కొడుకుకు సరైన గుణపాఠం చెప్పాడా తండ్రి. హన్మకొండ(D) ఎల్కతుర్తి మాజీ MPP శ్యాంసుందర్ రూ.3Cr విలువైన మూడెకరాల భూమిని ప్రభుత్వానికి రాసిచ్చారు. ప్రభుత్వ స్కూల్/ కాలేజీ కట్టి తన భార్య పేరు పెట్టాలని కోరారు. భార్య మరణించినప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ఆయనను కొడుకు రంజిత్ రెడ్డి చేరదీయలేదు. పైగా కొంత ఆస్తి తన పేరిట రాయించుకొని దాడి చేశారు. దీంతో శ్యాంసుందర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
News October 15, 2025
ఆవు పేడతో నెలకు రూ.25వేల ఆదాయం

జీవితంలో ఎదగాలనే తపన ఉంటే ఆవు పేడతోనూ అద్భుతాలు చేయొచ్చని నిరూపిస్తున్నారు మధ్యప్రదేశ్ సాగర్ ప్రాంత మహిళలు. పేడతో కుందులు, బొమ్మలు, ల్యాంప్స్, గోడ గడియారాల లాంటివి తయారు చేసి విక్రయిస్తున్నారు. కొన్ని వస్తువులను విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. ఇలా ప్రతి నెలా సగటున ₹25K వరకు సంపాదిస్తున్నారు. పండుగ సమయాల్లో ఈ మొత్తం ₹80వేలకు చేరుతోంది.
* రోజూ మహిళల స్ఫూర్తిదాయక కథనాల కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.
News October 15, 2025
పంచ భూతాలేనా? ఆరోది కూడా ఉందా?

ఈ అనంత విశ్వం పంచభూతాల కలయికతోనే ఏర్పడింది. ఆరో భూతం లేదు. చైతన్య స్వరూపుడైన పరమాత్మ ఈ 5 శక్తుల ద్వారానే సృష్టిని నడుపుతాడు. భూమి సృష్టికి ఆధారం కాగా, జలం వృద్ధి చేస్తుంది. అగ్ని మార్పును తీసుకురాగా, వాయువు జీవాన్ని ఇస్తుంది, తీసుకుపోతుంది. ఆకాశం సర్వాన్నీ అనుగ్రహిస్తుంది. ప్రజల సుఖ దుఃఖాలు, విశ్వ భవిష్యత్తు ఈ ప్రకృతి శక్తులపైనే ఆధారపడి ఉంటాయనే సత్యాన్ని జ్ఞానులు మాత్రమే గ్రహించగలరు.<<-se>>#SIVOHAM<<>>