News November 16, 2024
కులగణన సకాలంలో పూర్తి చేయండి: రేవంత్

TG: కులగణనను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏ ఒక్క ఇల్లును వదలకుండా ప్రతి ఇంట్లో సమగ్ర సర్వే నిర్వహించాలన్నారు. ‘44.1శాతం సర్వే పూర్తైంది. 5.24 లక్షల ఇళ్లలో సర్వే పూర్తైంది. సర్వేకు ఆటంకం కలిగించే వారిని ఉపేక్షించవద్దు. సర్వే జరుగుతున్న తీరును రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి’ అని సీఎం సూచించారు.
Similar News
News January 1, 2026
2026లో IPOల జాతర.. లిస్ట్లో జియో, ఫ్లిప్కార్ట్, ఫోన్పే

2026లోనూ IPOల జాతర కొనసాగనుంది. ఈ ఏడాది పలు పెద్ద కంపెనీలు స్టాక్ మార్కెెట్లో ఎంట్రీకి సిద్ధమవుతున్నాయి. దాదాపు రూ.11-12 లక్షల కోట్ల విలువైన పబ్లిక్ లిస్టింగ్కు రిలయన్స్ జియో ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది తొలి భాగంలోనే IPOకు రానుంది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కూడా సుమారు రూ.6 లక్షల కోట్ల వాల్యుయేషన్తో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఫోన్ పే, జెప్టో, ఓయోతోపాటు పదుల సంఖ్యలో కంపెనీలు లైన్లో ఉన్నాయి.
News January 1, 2026
మహిళలూ కొత్త సంవత్సరంలో ఇవి ముఖ్యం

తల్లి, భార్య, కూతురు, కోడలు పాత్రల్లో జీవిస్తున్న మహిళ తన గురించి తాను మర్చిపోయింది. ఈ కొత్త సంవత్సరంలోనైనా నీ కోసం నువ్వు బ్రతుకు. నీ నిర్ణయాలు నువ్వు తీసుకో, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టు. కష్టపడి నిర్మించుకున్న కెరీర్, చెమట చిందించి సంపాదించిన ప్రతి రూపాయినీ కాపాడుకో.. ఇంటర్నెట్ వాడకంలో జాగ్రత్తగా ఉండు.. ఆరోగ్యాన్ని సంరక్షించుకో.. కొత్తసంవత్సరాన్ని అద్భుతంగా మార్చుకో..
News January 1, 2026
క్లీనెస్ట్ సిటీ.. కలుషిత నీటితో 10 మంది మృతి

దేశంలోనే క్లీనెస్ట్ సిటీగా గుర్తింపు పొందిన ఇండోర్(MP)లో నీటి కాలుష్యంతో 10 మంది మరణించడం సంచలనంగా మారింది. మున్సిపల్ కార్పొరేషన్ సప్లై చేసే మంచినీటి పైప్ లైన్లో మురుగునీరు కలవడంతో ఇలా జరిగిందని అధికారులు వెల్లడించారు. DEC 25నే కుళాయిల నుంచి దుర్వాసన వస్తోందని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని భగీరథ్పుర వాసులు తెలిపారు. మృతుల్లో 6 నెలల శిశువు కూడా ఉంది. 2వేల మంది చికిత్స పొందుతున్నారు.


