News February 3, 2025

కంకషన్ వివాదం: క్రిస్ బ్రాడ్ తీవ్ర విమర్శలు

image

భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ ముగిసినా కంకషన్ వివాదం మాత్రం ఇంకా చల్లారలేదు. దూబే స్థానంలో హర్షిత్ రాణాను సబ్‌స్టిట్యూట్‌గా భారత్ ఆడించడం అన్యాయమని ICC మ్యాచ్ రిఫరీ క్రిస్ ఆరోపించారు. ‘స్వతంత్రంగా వ్యవహరించే అధికారుల్నే ICC నియమించాలి. మరి ఇప్పుడు ఏమైంది. పక్షపాతం, అవినీతితో కూడిన పాత రోజుల్లోకి ఎందుకెళ్తోంది?’ అని ప్రశ్నించారు. మ్యాచ్ రిఫరీగా ఇరు దేశాలకు చెందని అధికారి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Similar News

News December 3, 2025

ఇమ్రాన్ ఆరోగ్యంగానే ఉన్నారు కానీ..: ఉజ్మా

image

పాకిస్థాన్ మాజీ ప్రధాని <<18450195>>ఇమ్రాన్<<>> ఖాన్ మరణించారనే ఊహాగానాలకు ఆయన సోదరి ఉజ్మా తెరదించారు. ఆయన అదియాలా జైలులో ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. అయితే ఐసోలేట్ చేయడంపై కోపంగా ఉన్నారని వెల్లడించారు. ఎవరితోనూ ఆయనను కలవనివ్వట్లేదని, ఇది మానసికంగా టార్చర్ చేయడమేనని పేర్కొన్నారు. కొద్ది సమయం సోదరుడితో జరిగిన సమావేశానికి మొబైల్ కూడా అనుమతించలేదని తెలిపారు.

News December 3, 2025

పాడి రైతులు ఈ విషయం గుర్తుంచుకోవాలి

image

రోజుకు రెండు లీటర్లు పాలిచ్చే 5 ఆవులను పోషించే బదులు.. రోజుకు 10 లీటర్లు పాలిచ్చే ఒక సంకరజాతి ఆవును పోషించడం ఎంతో లాభసాటిగా ఉంటుందని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాడి పశువుల పోషణ వ్యయంలో 60 నుంచి 70 శాతం వ్యయం దాణా, గడ్డి, మందులకే ఖర్చవుతుంది. పాడి పరిశ్రమను లాభసాటిగా సాగించాలంటే పాడి పశువుల మేపుపై అదుపు, సంకరజాతి పశువుల పోషణపై సరైన అవగాహన కలిగి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

News December 3, 2025

విశాఖలో 12 నుంచి కాగ్నిజెంట్ కార్యకలాపాలు

image

AP: ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖలో ఈ నెల 12 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ప్రస్తుతం ఐటీ పార్కులోని తాత్కాలిక భవనంలో తన సెంటర్ ఏర్పాటు చేయనుంది. అదే రోజు కాపులుప్పాడలో ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. 2028 జూన్ నాటికి తొలి దశ నిర్మాణాలు పూర్తవుతాయని సమాచారం.