News May 4, 2024

ప్లే ఆఫ్స్‌కు వెళ్తామని నమ్మకముంది: ఆర్సీబీ కోచ్

image

తమ జట్టు ప్లే ఆఫ్స్‌కు వెళ్తుందన్న నమ్మకం ఇంకా ఉందని ఆర్సీబీ హెడ్ కోచ్ యాండీ ఫ్లవర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు గుజరాత్‌తో హోం గ్రౌండ్‌లో మ్యాచ్ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘మా ప్లే ఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇప్పటికి వరసగా రెండు మ్యాచులు గెలిచాం. ఈరోజు కూడా గెలుస్తాం. మా ఆటగాళ్లు ఎప్పుడెప్పుడు ఆడదామా అని ఎదురుచూస్తున్నారు. మాకు ఇంకా నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.

Similar News

News November 24, 2025

ఐబొమ్మ రవి.. విచారణలో సంచలన విషయాలు!

image

ఐబొమ్మ రవి మొదటి నుంచి క్రిమినల్ మెంటాలిటీ కలిగి ఉన్నాడని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఇవాళ అతడి మాజీ భార్యనూ పోలీసులు విచారించారు. తనతో పాటు కూతురిని చిత్రహింసలకు గురిచేశాడని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. రవి ప్రవర్తన నచ్చకనే విడాకులు ఇచ్చినట్లు ఆమె వెల్లడించారని వార్తలు వస్తున్నాయి. స్నేహితుడు నిఖిల్‌కు నెలకు రూ.50వేలు ఇచ్చి ఐబొమ్మ సైట్ పోస్టర్లు డిజైన్ చేయించుకున్నట్లుగా గుర్తించారు.

News November 24, 2025

కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి: CM

image

AP: అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. బయో వేస్ట్ డిస్పోజల్స్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. 15,526 హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ద్వారా వచ్చే బయో వ్యర్థాలను 48 గంటల్లోగా డిస్పోజ్ చేయాల్సిందే’ అని స్పష్టం చేశారు.

News November 24, 2025

టీమ్ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై రవిశాస్త్రి ఫైర్

image

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఫైరయ్యారు. రెండో టెస్టులో సుందర్‌ను ఎనిమిదో స్థానంలో పంపడం సరికాదన్నారు. ఈ ఆలోచన అర్థం లేనిదని మండిపడ్డారు. కోల్‌కతా(తొలి) టెస్టులో నలుగురు స్పిన్నర్లను ఆడించి, వారిలో ఒకరికి ఒకే ఓవర్ ఇవ్వడమూ సరైన నిర్ణయం కాదన్నారు. కనీసం స్పెషలిస్టు బ్యాటర్‌తో వెళ్లి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.