News March 30, 2024

తిరుమలలో రద్దీ.. దర్శనానికి 24 గంటలు

image

AP: విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమలలో రద్దీ పెరిగింది. ఉచిత సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి భక్తులు బయట లైన్లలో వేచి ఉన్నారు. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటలు, టైమ్ స్లాట్ సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న 60,958 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

Similar News

News January 5, 2026

తెలుగు హీరోలను తాకిన బికినీ ట్రెండ్

image

SMలో గ్రోక్ AIతో మొదలైన <<18744158>>బికినీ ట్రెండ్<<>> భారతీయులను కంగారు పెట్టిన విషయం తెలిసిందే. నిండుగా దుస్తులున్న ఫొటోలనూ ఒక కమాండ్‌తో బికినీలోకి మార్చేస్తోంది. హీరోయిన్లు, ఇతర సెలబ్రిటీలు ఈ ట్రెండ్‌కు బాధితులయ్యారు. కేంద్రం సీరియస్ అయ్యి ఆ కంటెంట్ తొలగించాలని ఆదేశించినా ఫలితంలేకుండా పోయింది. ఇప్పుడు దీని ఎఫెక్ట్ తెలుగు స్టార్ హీరోలను తాకింది. ట్విటర్‌లో వారి ఫొటోలను కూడా కొందరు బికినీల్లోకి మారుస్తున్నారు.

News January 5, 2026

పిల్లలకు ఈ పోషకాలు అత్యవసరం

image

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని విటమిన్లు, మినరల్స్ అన్నీ తగినంత అందేలా చూసుకోవాలి. ముఖ్యంగా విటమిన్లు A, B, C, D, E, అండ్ K వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు పిల్లలకు చాలా అవసరం. ఆరోగ్యకరమైన అభివృద్ధికి వారికి ఫోలేట్, కాల్షియం, అయోడిన్, ఇనుము, జింక్ కూడా కావాలి. ఈ పోషకాలు పిల్లల మెదడు, నరాల అభివృద్ధి, కంటి చూపు, ఎముకల బలం, రోగనిరోధక శక్తి, జీవక్రియకు సహకరిస్తాయి.

News January 5, 2026

బెయిలా? జైలా? ఉమర్ ఖలీద్‌పై నేడే సుప్రీం తీర్పు

image

2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఐదేళ్లుగా జైలులో ఉన్న ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. డిసెంబర్‌లో సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. నిందితులు ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర పన్నారని ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తుండగా.. ఎటువంటి ఆధారాలు లేకుండా ఏళ్ల తరబడి జైల్లో ఉంచడం అన్యాయమని నిందితుల తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు.