News March 30, 2024
తిరుమలలో రద్దీ.. దర్శనానికి 24 గంటలు
AP: విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమలలో రద్దీ పెరిగింది. ఉచిత సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి భక్తులు బయట లైన్లలో వేచి ఉన్నారు. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటలు, టైమ్ స్లాట్ సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న 60,958 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
Similar News
News January 22, 2025
టీమ్ఇండియా జెర్సీపై పాక్ పేరు.. ICC వార్నింగ్!
టీమ్ఇండియా జెర్సీలపై హోస్ట్నేమ్ పాకిస్థాన్ను ముద్రించకుండా ఉండేందుకు ICC అనుమతించలేదని తెలిసింది. ఛాంపియన్స్ ట్రోఫీ నిబంధనలను అన్ని దేశాలూ పాటించాల్సిందేనని స్పష్టం చేసినట్టు సమాచారం. జెర్సీలపై టోర్నీ లోగోలను ముద్రించడం టీమ్స్ బాధ్యతని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. BCCI రిక్వెస్ట్ను తిరస్కరించిందని, ఒకవేళ హోస్ట్నేమ్ ముద్రించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది.
News January 22, 2025
బిల్గేట్స్తో భేటీ కానున్న చంద్రబాబు
AP: దావోస్ పర్యటనలో భాగంగా మూడో రోజు పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్తో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను వివరించనున్నారు. అనంతరం యూనిలీవర్, డీపీ వరల్డ్, పెట్రోలియం నేషనల్ బెర్హాద్, గూగుల్ క్లౌడ్, పెప్సికో, ఆస్ట్రాజెనెకా సంస్థల సీఈవోలతో సీఎం భేటీ అవుతారు.
News January 22, 2025
BREAKING: సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్
హైదరాబాద్లోని స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పుష్ప-2 సినిమా భారీ కలెక్షన్ల నేపథ్యంలో మేకర్స్ ఇళ్లపై నిన్నటి నుంచి రైడ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ చిత్ర డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు దిల్ రాజు ఇల్లు, కార్యాలయంలోనూ రైడ్స్ కొనసాగుతున్నాయి.