News May 24, 2024
కంగనపై కాంగ్రెస్ దుర్భాషలు ‘మండి’కి అవమానం: పీఎం మోదీ

నటి కంగనా రనౌత్ బీజేపీ తరఫున హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్పై మండిపడ్డారు. ‘కంగనపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలు, దుర్భాషలు మండి ప్రాంతానికి అవమానం. ఎన్నికల్లో వారికి తగిన సమాధానం చెప్పాలి’ అని పేర్కొన్నారు. అంతకుముందు కంగన గులాబీ ఇచ్చి ప్రధానికి స్వాగతం పలికారు.
Similar News
News February 18, 2025
బీజేపీతో గుజరాత్ బంధం విడదీయరానిది: PM

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీతో గుజరాత్ బంధం విడదీయరానిదని, ఇది మరింత బలపడుతోందని తెలిపారు. అభివృద్ధి రాజకీయాలకు ఇది పెద్ద విజయం అని అభివర్ణించారు. GJలో 1912 వార్డులకు గాను బీజేపీ 1402, కాంగ్రెస్ 260, ఎస్పీ, ఆప్ కలిసి 236 వార్డులు గెలుచుకున్నాయి. 68 మున్సిపాలిటీల్లో బీజేపీ 57, కాంగ్రెస్ 1, ఎస్పీ 2, ఇతరులు 3 చోట్ల విజయం సాధించాయి.
News February 18, 2025
ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఎల్లుండి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి జరగాల్సిన ఏపీ క్యాబినెట్ భేటి వాయిదా పడింది.
News February 18, 2025
PHOTO OF THE DAY

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజ్నోవా, కుమారుడు అకీరా నందన్, దర్శకుడు త్రివిక్రమ్తో కలిసి మహాకుంభమేళాలోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గంగా దేవికి పవన్ దంపతులు హారతులు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీరంతా కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ PHOTO OF DAY ఇదేనంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.