News November 21, 2024
అదానీతో కాంగ్రెస్, BJP అనుబంధం దేశానికి అవమానం: KTR

TG: అదానీపై USలో కేసు నమోదైన నేపథ్యంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR స్పందించారు. అదానీతో కాంగ్రెస్, BJP అనుబంధం దేశానికే అవమానం అని అభిప్రాయపడ్డారు. ఆయన అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడని, భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడంటూ దుయ్యబట్టారు. రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీ, మూసీలో అదానీ వాటా ఎంత అని ప్రశ్నించారు. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలన్నారు.
Similar News
News November 22, 2025
కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించాలి: DYFI

AP: కానిస్టేబుల్ ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా శిక్షణ ప్రారంభించకపోవడంపై DYFI మండిపడింది. దీనివల్ల అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపింది. 6,100 మందికి వెంటనే ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించింది. ఈ పోస్టులకు 2022లో నోటిఫికేషన్ వెలువడగా లీగల్ సమస్యలతో ప్రక్రియ ఆలస్యమైంది. ఈ ఏడాది జూన్లో మెయిన్స్ నిర్వహించి AUGలో రిజల్ట్స్ ప్రకటించారు.
News November 22, 2025
విద్యార్థినుల కోసం కొత్త పథకం: మంత్రి లోకేశ్

AP: వచ్చే ఏడాది నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ‘దేశవిదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే విద్యార్థినులకు ఆర్థిక సాయం అందిస్తాం. ప్రస్తుతం విదేశాల్లో APకి చెందిన 27,112 మంది, స్వదేశంలో 88,196 మంది విద్యార్థినులు ఉన్నత చదువులు చదువుతున్నారు’ అని ట్వీట్ చేశారు.
News November 22, 2025
CSIR-NML 67 పోస్టులకు నోటిఫికేషన్

<


