News March 17, 2024

మేము పోరాటం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది: DK అరుణ

image

రాష్ట్రంలో ప్రజల తరపున బీజేపీ పోరాటం చేస్తే అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, MBNR లోక్ సభ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. విజయ సంకల్ప సభలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో 60 ఏళ్లలో చేయనివి బీజేపీ పదేళ్లలోనే చేసి చూపెట్టిందని, ప్రధాని మోదీ భారత్ కీర్తిని పెంచుతుంటే కాంగ్రెస్ మాత్రం విషం చిమ్ముతోందని, ప్రతి ఒక్కరి నోటి వెంట మోదీ మాటే వినిపిస్తోందని అన్నారు.

Similar News

News October 17, 2025

‘ఏక్ పేడ్ మా కే నామ్’.. విస్తరించండి: గవర్నర్

image

విద్యార్థులు ఒక్కొక్కరు కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలి పీయూ ఛాన్సలర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. పీయూలో నిర్వహించిన స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ‘స్నాతకోత్సవం అనేది కేవలం పట్టాల ప్రదాన వేడుక మాత్రమే కాదు, విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల సేవ, తల్లిదండ్రుల త్యాగాలను స్మరించుకునే పవిత్ర సందర్భం. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని’ సూచించారు.

News October 17, 2025

MBNR: రూ.100 కోట్ల ‘PM–USHA’ పనులు వేగవంతం- VC

image

పీయూలో ఇంజినీరింగ్ కళాశాల,లా కళాశాల, కొత్త హాస్టళ్లు, పరిశోధన కేంద్రాలు వంటి ప్రాజెక్టులు రూ.100 కోట్ల PM–USHA పథకం కింద వేగంగా అభివృద్ధి చెందుతుందని వీసీ ఆచార్య డాక్టర్ జిఎన్.శ్రీనివాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఐదు క్యాంపస్ కళాశాలలు, 3 పీజీ సెంటర్లు, 24 కోర్సులు కొనసాగుతున్నాయని, NSS, క్రీడా, పర్యావరణ, సాంస్కృతిక రంగాల్లో విద్యార్థుల చురుకైన భాగస్వామ్యాన్ని’ ప్రశంసించారు.

News October 16, 2025

మహబూబ్‌నగర్: కలెక్టరేట్ ప్రాంగణంలో మొక్క నాటిన గవర్నర్

image

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లో ఈరోజు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది.
కలెక్టరేట్ ప్రాంగణంలో గవర్నర్ మొక్క నాటి, నీళ్లు పోశారు. ఈ సమావేశంలో టీబీ నియంత్రణ చర్యలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యకలాపాలు, అలాగే సామాజిక సేవా కార్యక్రమాల సమన్వయం వంటి ముఖ్య అంశాలపై చర్చించారు.