News December 27, 2024
మన్మోహన్ స్మారకార్థం ప్రత్యేక స్థలం కోరిన కాంగ్రెస్
మన్మోహన్ సింగ్ అంత్యక్రియల కోసం ఢిల్లీలోని యమునా నద్ది ఒడ్డున ప్రత్యేక స్మృతి స్థలాన్ని కేటాయించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ కోరింది. ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి ఖర్గే తీసుకెళ్లారు. రాజ్నాథ్ సింగ్తోనూ కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. అయితే, స్థలం కొరత దృష్ట్యా జాతీయ స్థాయి నేతలకు రాజ్ ఘాట్లో ఉమ్మడి స్మారక స్థలం- రాష్ట్రీయ స్మృతి స్థల్ ఏర్పాటుకు 2013లోనే UPA నిర్ణయించడం గమనార్హం.
Similar News
News January 20, 2025
షూటింగ్ సెట్లో ప్రమాదం.. ఇద్దరు హీరోలకు గాయాలు
బాలీవుడ్ హీరోలు అర్జున్ కపూర్, జాకీ భగ్నానీ గాయపడ్డారు. ‘మేరే హస్బెండ్ కి బీవి’ మూవీ షూటింగ్ సందర్భంగా సెట్ పైకప్పు కూలింది. దీంతో వీరిద్దరికీ గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు BN తివారీ అదృష్టవశాత్తు నటులకు తీవ్ర గాయాలు కాలేదని చెప్పారు. అయితే షూటింగ్ల సమయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
News January 20, 2025
భారీ జీతంతో ఉద్యోగాలు
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL)లో 642 పోస్టులకు దరఖాస్తు గడువు FEB 16తో ముగియనుంది. ఇందులో జూ.మేనేజర్, ఎగ్జిక్యూటివ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులున్నాయి. టెన్త్, మూడేళ్ల డిప్లొమా చేసిన వారు అర్హులు. MTSకు 18-33ఏళ్లు, మిగతా పోస్టులకు 18-30Y వయసు ఉండాలి. జీతం MTSకు ₹16K-₹45K, జూ.మేనేజర్ ₹50K-₹1.60L, ఎగ్జిక్యూటివ్కు ₹30K-₹1.20L ఉంటుంది.
వెబ్సైట్: <
News January 20, 2025
వరల్డ్ రికార్డు సృష్టించిన ఇండియన్ ఆర్మీ
ఇండియన్ ఆర్మీకి చెందిన ‘డేర్ డెవిల్స్’ టీమ్ వరల్డ్ రికార్డు సృష్టించింది. కదులుతున్న బైక్స్పై అత్యంత ఎత్తైన (20.4 ఫీట్) మానవ పిరమిడ్ నిర్మించింది. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు 7 బైక్లపై 40 మంది 2కి.మీ మేర ప్రయాణించడంతో ఈ ఘనతను అందుకుంది. ఆర్మీలోని మోటార్ సైకిల్ రైడర్ డిస్ప్లే టీమ్ను ‘డేర్ డెవిల్స్’ అని పిలుస్తారు.