News July 7, 2024
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోంది: హరీశ్ రావు

TG: సీఎం రేవంత్కు మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. పాఠశాల విద్యను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని, స్కూళ్లలోని సమస్యలను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. టీచర్ల కొరత, వేతనాల ఆలస్యం, అరకొర వసతులు వంటి సమస్యలు రాష్ట్ర విద్యావ్యవస్థను పట్టిపీడిస్తున్నాయని పేర్కొన్నారు.
Similar News
News March 5, 2026
ఖమేనీ మృతిపై సంతాపం తెలిపిన భారత్

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మృతిపై భారత్ తొలిసారి స్పందించింది. ఆయన మరణానికి సంతాపం తెలియజేసింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్వయంగా ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీకి వెళ్లి రాయబారులతో మాట్లాడారు. అక్కడ సంతాప సందేశ బుక్పై సంతకం చేశారు. కాగా ఖమేనీ మృతిపై ప్రధాని మోదీ స్పందించకపోవడాన్ని విపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.
News March 5, 2026
అణుబాంబులన్నీ పేలితే ఏం జరుగుతుంది?

అమెరికా అణుబాంబులు జపాన్లోని హిరోషిమా, నాగసాకిలను అతలాకుతలం చేశాయి. అలాంటిది ప్రపంచ దేశాలు తమ దగ్గరున్న 12వేల అణుబాంబులను ప్రయోగిస్తే ఏం జరుగుతుందో తెలుసా? కేవలం 100 అణుబాంబులు పేలితే వచ్చే పొగ సూర్యరశ్మిని పదేళ్లపాటు అడ్డుకుంటుంది. దీనివల్ల భూమి గడ్డకట్టి ‘న్యూక్లియర్ వింటర్’ ఏర్పడుతుంది. పంటలు పండవు, గాలి కలుషితమై మనుషులు అంతమైపోతారు. అదే 12వేల అణుబాంబులు పేలితే సగం సోలార్ సిస్టమ్ ఉండదు.
News March 5, 2026
AC కొంటున్నారా? ఇవి గుర్తుంచుకోండి!

గతంలో ధనవంతులకే పరిమితమైన ACలు ఇప్పుడు దిగువ మధ్యతరగతి ఇళ్లకూ వచ్చేస్తున్నాయి. ACలు కొనేముందు కింది పాయింట్లను పరిశీలించండి.
*100-120 స్క్వేర్ ఫీట్ల గది ఉంటే 1 టన్ ఏసీ సరిపోతుంది.
*5 స్టార్ రేటింగ్ ఉన్న ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ కొనేందుకు ప్రయత్నించండి. దీనివల్ల 30-40% విద్యుత్ ఆదా అవుతుంది.
*కూలింగ్ కెపాసిటీ ఔట్పుట్ ఎక్కువగా ఉండాలి.
*10 ఏళ్ల కంప్రెషర్ వారంటీ ఉండేలా చూసుకోండి.
Share It


