News July 7, 2024
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోంది: హరీశ్ రావు

TG: సీఎం రేవంత్కు మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. పాఠశాల విద్యను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని, స్కూళ్లలోని సమస్యలను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. టీచర్ల కొరత, వేతనాల ఆలస్యం, అరకొర వసతులు వంటి సమస్యలు రాష్ట్ర విద్యావ్యవస్థను పట్టిపీడిస్తున్నాయని పేర్కొన్నారు.
Similar News
News March 9, 2026
మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తే ఉపేక్షించబోం: CBN

AP: గత ఐదేళ్లూ కల్తీ, కుంభకోణాలు చేశారని CM చంద్రబాబు ఆరోపించారు. నంద్యాల(D) కొత్తబురుజులో మాట్లాడుతూ కల్తీ మద్యంతో వేల మంది మరణానికి వైసీపీ నేతలు కారణమయ్యారని విమర్శించారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్నీ కల్తీ చేసి ఆలయ పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు కుట్రపూరితంగా మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, వీటిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
News March 9, 2026
తిన్న వెంటనే స్నానం చేస్తున్నారా?

తిన్న తర్వాత బాడీ ‘డైజెషన్ మోడ్’లోకి వెళ్తుంది. రక్తం అంతా పొట్ట దగ్గరకు చేరి ఆహారాన్ని అరిగించే పనిలో ఉంటుంది. అలాంటి టైమ్లో వెంటనే స్నానం చేస్తే బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేయడం కోసం బ్లడ్ సర్క్యులేషన్ను అడ్జస్ట్ చేస్తుంది. దీనివల్ల డైజెషన్ ప్రాసెస్ స్లో అయిపోయి.. కడుపు ఉబ్బరం, హెవీనెస్, గ్యాస్ వంటి సమస్యలొస్తాయి. అందుకే తిన్న తర్వాత 30 నుంచి 45 నిమిషాల గ్యాప్ ఇచ్చి స్నానం చేస్తే బెస్ట్.
News March 9, 2026
భవిష్యత్తులోనూ తప్పులు జరగకుండా పాస్ పుస్తకాలు: సీఎం

AP: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశామని CM CBN చెప్పారు. YCP హయాంలో జరిగిన తప్పులను సరిదిద్ది QR కోడ్తో పారదర్శకంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామన్నారు. నంద్యాల(D) కొత్తబురుజులో రైతులకు కొత్త పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. భవిష్యత్తులోనూ ఎక్కడా తప్పులు జరగకుండా చూస్తామని తెలిపారు.


