News July 11, 2024
కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతోంది: మోత్కుపల్లి

TG: మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్ప ఏ హామీనీ ప్రభుత్వం నెరవేర్చలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు విమర్శించారు. ‘నిరుద్యోగుల పట్ల తల్లిదండ్రుల పాత్ర పోషించాల్సిన ప్రభుత్వం వారిని కింద పడేసి కొడుతోంది. ఇది మంచి పద్ధతి కాదు. గత ప్రభుత్వాన్ని మార్చేసింది నిరుద్యోగులే అనే విషయం మర్చిపోవద్దు. కాంగ్రెస్ గ్రాఫ్ క్రమంగా పడిపోతోంది. MP ఎన్నికల్లో 8 సీట్లకే పరిమితమైంది’ అని పేర్కొన్నారు.
Similar News
News February 19, 2025
సెమిస్టర్ వారీగా ఫీజు రీయింబర్స్మెంట్: లోకేశ్

AP: ఇకపై ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా విడుదల చేస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. గత ప్రభుత్వం రూ.4వేల కోట్ల రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టిందని తెలిపారు. ఆర్థికంగా కుదుటపడ్డాక వాటిని చెల్లిస్తామని తిరుపతి పద్మావతి ఇంజినీరింగ్ కాలేజీలో ఆయన చెప్పారు. తాను జగన్పై చేసిన పోరాటం కంటే విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం 3రెట్లు అధికంగా చంద్రబాబుగారితో పోరాడుతున్నానని లోకేశ్ సరదాగా అన్నారు.
News February 19, 2025
కొత్త సీఎంకు మా మద్దతు ఉంటుంది: కేజ్రీవాల్

ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తాకు మాజీ సీఎంలు అర్వింద్ కేజ్రీవాల్, ఆతిశీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు బీజేపీ ఇచ్చిన హామీల వల్లే ఈ అధికారం వచ్చిందని, ఆ హామీలను నెరవేరుస్తారని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఢిల్లీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కొత్త సీఎంకు ప్రతి పనిలో అవసరమైన మద్దతు ఇవ్వడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
News February 19, 2025
KCRకు ప్రతిపక్ష హోదా ఎందుకు?: TPCC చీఫ్

TG: ఫాం హౌస్కి పరిమితమైన KCRకు ప్రతిపక్ష హోదా ఎందుకు అని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పినా ఆయన తీరు మారలేదని, అధికారం కోసం గుంట నక్కలా ఎదురు చూసినా ఫలితం ఉండదని అన్నారు. ‘KCR పాలనకు INC పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడటానికి KCRకు సిగ్గు ఉండాలి. గతంలో మా MLAలను చేర్చుకున్నప్పుడు మీ సోయి ఎటు పోయింది’ అని మండిపడ్డారు.