News December 14, 2024
దేశానికి కాంగ్రెస్ అనేక విధాలుగా నష్టం కలిగించింది: PM మోదీ
దేశానికి కాంగ్రెస్ పార్టీ అనేక నష్టాలు కలిగించిందంటూ పార్లమెంటు ప్రసంగంలో ప్రధాని మోదీ విమర్శించారు. ‘రాజ్యాంగ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ యత్నించింది. రాజ్యాంగ నిర్మాతల కృషిని మట్టిపాలు చేసేందుకు ప్రయత్నించింది. 55 ఏళ్ల పాటు దేశాన్ని ఒకే కుటుంబం పాలించింది. 1947 నుంచి 1952 వరకూ కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికలు జరగలేదు’ అని గుర్తుచేశారు.
Similar News
News January 17, 2025
పంచాయతీ కార్యదర్శులకు షాక్!
TG: నల్గొండ(D)లో అనుమతి లేకుండా నెలల తరబడి విధులకు గైర్హాజరైన 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీసును జిల్లా కలెక్టర్ బ్రేక్ చేశారు. దీంతో గైర్హాజరైన కాలానికి సంబంధించిన సర్వీసును వారు కోల్పోనున్నారు. దీని వల్ల సర్వీస్ రెగ్యులరైజేషన్, ఇంక్రిమెంట్లు, పెన్షన్ల విషయంలో వారికి నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం వీరిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. పాత స్థానాల్లో కాకుండా వేరే చోట పోస్టింగ్ ఇచ్చారు.
News January 17, 2025
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రా. 24 క్యారెట్ల గోల్డ్ రూ.650 పెరిగి రూ.81,270కి చేరింది. 22 క్యారెట్ల పసిడి రూ.600 పెరిగి రూ.74,500 పలుకుతోంది. కేజీ వెండి రూ.1000 పెరిగి రూ.1,04,000కు చేరింది.
News January 17, 2025
బీదర్ దొంగల కోసం కొనసాగుతున్న పోలీసుల వేట
<<15173290>>బీదర్ దొంగల కోసం<<>> పోలీసులు వేట కొనసాగుతోంది. నిందితులను ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్కు చెందిన వారిగా గుర్తించారు. వారు హైదరాబాద్ నుంచి అడ్డదారుల్లో రాయ్పూర్కు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. నిన్న బీదర్లో భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపి ఏటీఎం డబ్బులు దొంగిలించిన నిందితులు సాయంత్రం హైదరాబాద్కు వచ్చారు. అఫ్జల్ గంజ్లో ట్రావెల్స్ సిబ్బందిపై కాల్పులు జరిపి పరారయ్యారు.